News
ఆదోని అబివృద్దికి రూ 1 కోటి 24 లక్షలు మంజూరు.. ఎమ్మెల్యే పార్థసారధి
కర్నూలు జిల్లా ఆదోని పురపాలక సంఘానికి తక్షణ అవసరాల కొరకు రూ 1 కోటి 24 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింనట్లు ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి తెలిపారు. శుక్రవారం పురపాలక శాఖ మంత్రి నారాయణని కలసి ఆదోని పురపాలక సంఘం పరిధిలోని విస్తారణ ప్రాంతాల అబివృద్దికి సంబంధించి రూ 44 కోటి నిధులకు అవసరమని కోరారు. పట్టణంలోనీ విస్తరణ ఏరియాలలో ప్రజలకు కనీసం అవసరాలైన మురుగు కాలువలు, రోడ్లు, పైపులైన్లు సీసీ రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, వారి సౌకర్యార్థము ప్రత్యేక నిధులను మంజూరు చేయించాల్సిందిగా మంత్రిని కోరారు. వెంటనే స్పందించిన మంత్రి తక్షణ అవసరాల కోసం కోటి 24 లక్షలను మంజూరు చేసినట్టు తెలిపారు. మిగిలిన నిధులను ప్రత్యేక నిధుల కింద మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపినట్లు తెలిపారు.

News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




