Connect with us

News

అక్రమ మద్యం విక్రయాల స్థావరాలపై పోలీసుల దాడులు

Published

on

karnataka Arrak Sale Lady

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం బావాజీ పేటలో శుక్రవారం సెబ్ పోలీసులు దాడులు నిర్వహించరు. ఈ దాడులలో బోయ గుంటమ్మ ను అరెస్ట్ చేసి ఆమె వద్ద నుండి 144 ఓసి డీలక్స్ విస్కీ కర్ణాటక మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆమెను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ దాడులలో సేబ్ ఇన్స్పెక్టర్ హరి కృష్ణ, SI లు శివ ప్రసాద్, మధు సుడన రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

తుంగభద్ర జలాశయానికి భారీగా పెరుగుతున్న నీటి నిల్వ

Published

on

హోస్పేట: 04.08.0226:

తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 04 (మంగళవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1616.13 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 51.145 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ప్రవాహాల వివరాలు:

  • ఇన్‌ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున   82087 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్‌ఫ్లో 91546 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.
  • అవుట్‌ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 1447 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.

గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1626.06 అడుగులుగా ఉండగా.. 80.003 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 712.654 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

Continue Reading

News

​ప్రమాదాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన అధికారులు

ఆదోని, ఆగస్టు 1: రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జాతీయ రహదారి–167పై…

Published

on

ఆదోని, ఆగస్టు 1: రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జాతీయ రహదారి–167పై అధికారుల బృందం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది. ఆదోని బసవేశ్వర సర్కిల్ నుండి మాధవరం క్రాస్ వరకు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను (బ్లాక్ స్పాట్లు) శనివారం ఆర్‌డీఓ శ్రీమతి కె. అరుణాదేవి నేతృత్వంలో అధికారులు పరిశీలించారు.

ఆర్డీవో మరియు ఆర్టిఓ అధికారులకు తనిఖీలు చేస్తున్న ఫోటో

​ఈ పరిశీలనలో రోడ్డు వెడల్పు, ప్రమాదకర మలుపులు, ప్రధాన కూడళ్లు, మీడియన్ ఓపెనింగ్స్, డ్రైనేజీ వ్యవస్థ, హెచ్చరిక బోర్డులు, రాత్రి వేళల్లో వెలుతురు (స్ట్రీట్ లైటింగ్) మరియు పాదచారుల భద్రతా అంశాలను అధికారులు సమగ్రంగా సమీక్షించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలి. ప్రజల ప్రాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలి కె. అరుణాదేవి, ఆర్‌డీఓ ఆదేశాలు & సూచనలు చేశారు.

ఆర్డీవో అధికారులతో కలసి తనిఖీలు చేస్తున్న ఫోటో

తక్షణ భద్రతా చర్యలు: ప్రమాదకర ప్రాంతాల్లో వెంటనే హెచ్చరిక బోర్డులు, రంబుల్ స్ట్రిప్స్, రిఫ్లెక్టివ్ క్యాట్ ఐస్, క్రాష్ బ్యారియర్లు, స్పీడ్ లిమిట్ బోర్డులు, సోలార్ బ్లింకర్లను ఏర్పాటు చేయాలి. శాశ్వత పరిష్కారాలు: సర్వీస్ రోడ్లు, బస్ బేల నిర్మాణం, వర్షపు నీటి పారుదల వ్యవస్థను మెరుగుపరచడం మరియు ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించిన శాశ్వత ప్రతిపాదనలు సిద్ధం చేసి త్వరితగతిన పూర్తి చేయాలి. ​అవగాహన కార్యక్రమాలు: ఇంజినీరింగ్ లోపాలను సరిచేయడంతో పాటు, వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి ప్రమాదాలను గణనీయంగా తగ్గించాలి.

ఆర్డీవో అధికారులతో కలసి తనిఖీలు చేస్తున్న ఫోటో

​ఈ తనిఖీ కార్యక్రమంలో ఆర్‌డీఓతో పాటు రోడ్లు & భవనాల శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ మహేశ్వర రెడ్డి, నేషనల్ హైవేస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ భాస్కర్ రెడ్డి, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (DTC) శ్రీమతి శాంతకుమారి, రెవెన్యూ, రవాణా, నేషనల్ హైవేస్, ఆర్‌అండ్‌బీ మరియు పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Continue Reading

News

​మున్సిపల్ నిబంధనలు పాటిస్తేనే పట్టణాభివృద్ధి: ఎమ్మెల్యే పార్థసారథి

ఆదోని పట్టణ సమగ్ర అభివృద్ధి సాధించాలంటే కమర్షియల్ భవనాల నిర్మాణాల్లో ప్రతి ఒక్కరూ మున్సిపల్ నిబంధనలు, పట్టణ ప్రణాళిక ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని స్థానిక శాసనసభ్యులు డా. పి.వి. పార్థసారథి వాల్మీకి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆదోనిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న నిర్మాణాల వల్ల పట్టణంలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. […]

Published

on

ఆదోని పట్టణ సమగ్ర అభివృద్ధి సాధించాలంటే కమర్షియల్ భవనాల నిర్మాణాల్లో ప్రతి ఒక్కరూ మున్సిపల్ నిబంధనలు, పట్టణ ప్రణాళిక ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని స్థానిక శాసనసభ్యులు డా. పి.వి. పార్థసారథి వాల్మీకి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆదోనిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

వంతెన ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న నిర్మాణాల వల్ల పట్టణంలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భవనాల నిర్మాణ సమయంలో అవసరమైన సెట్‌బ్యాక్‌లు వదలకుపోవడం, ప్రజా వినియోగ స్థలాలను ఆక్రమించడం వల్ల రహదారులు ఇరుకుగా మారుతున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల డ్రైనేజీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినడమే కాకుండా, తాగునీటి పైప్‌లైన్ల నిర్వహణ కూడా మున్సిపల్ అధికారులకు పెద్ద సవాలుగా మారిందని వివరించారు.

హోటల్ యజమానిని పరిగణిస్తున్న ఎమ్మెల్యే

చట్టబద్ధమైన అనుమతులు తప్పనిసరి: కమర్షియల్ కాంప్లెక్స్‌లు, భవనాలు నిర్మించేవారు ప్రజా ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగకుండా చూసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. సంబంధిత అధికారుల నుండి చట్టబద్ధమైన అనుమతులు పొందిన తర్వాతే, పట్టణ ప్రణాళికకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.

బట్టల షాప్ యజమానులను పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే

ప్రజల సహకారం కోరిన ఎమ్మెల్యే: ఆదోని పట్టణ ప్రజలకు మెరుగైన రహదారులు, సమర్థవంతమైన మురుగునీటి పారుదల వ్యవస్థ, నిరంతర తాగునీటి సరఫరా అందించేందుకు ప్రభుత్వం పూర్తి కట్టుబడి ఉందన్నారు. పట్టణ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. పట్టణాన్ని సుందరంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ మున్సిపల్ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. పి.వి. పార్థసారథి వాల్మీకి విజ్ఞప్తి చేశారు.

Continue Reading

Trending