News
ఎస్ ఎస్ ట్యాంక్ లో నీరు నింపకపోతే ఎండాకాలంలో పరిస్థితి ఎలా?
కర్నూలు జిల్లా ఆదోని నీటి సమస్య నివారణకు చర్యలు తీసుకోవాలని సలహాలు, సూచనలతో కూడిన వినతి పత్రం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎ. నూర్ అహ్మద్ మరియు నాయకులు అందజేశారు.
ఈ సందర్భంగా నూర్ అహ్మద్ మాట్లాడుతూ అవినీతి నిర్లక్ష్యముతో కట్టబడిన బసాపురం సమ్మర్ స్టోరేజి ట్యాంకు శిథిలావస్థకు చేరిందని ఆలాగే వదిలేస్తే కట్ట తెగి సమ్మర్ స్టోరేజి ట్యాంక్ అంతమయ్యే ప్రమాదం పొంచి ఉన్నదని తెలిపారు.
ఈ ట్యాంకులో ప్రస్తుత వానాకాలంలో నీరు నింపకపోతే రాబోయే ఎండాకాలంలో ఆదోని ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆందోళన వ్యక్తం చేశారు. మరోపక్క వందల ఏళ్ల నాటి రామజల చెరువు నీరు నిండుగా ఉన్నా ఆ నీరు తాగడానికి పనికి రావని మునిసిపల్ చైర్మన్ చెప్పటం మునిసిపాలిటీ అధికారుల, పాలకుల వైఫల్యమే అని అన్నారు.

ఆదోనిలో చీరలు జాకెట్ల రాజకీయం నడుస్తోంది అని రాబోయే రోజుల్లో చీరలు జాకెట్లు ఉతుక్కోవటానికి నీరు దొరకని పరిస్థితి రాబోతుందని నాయకులు గ్రహించాలి అని తెలిపారు.
ఇప్పటికైన పాలకులు, అధికారులు బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును యుద్ధ ప్రాతిపదికన రాతి గోడలతో పటిష్టం చేసి నింపాలని,
రామజల చెరువును శుభ్రపరిచి, పూర్తి స్థాయిలో నింపాలని, కొండలనుంచి చెరువులోకి వచ్చే నీటిని పక్కదారి పట్టకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమములో ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎ. నూర్ అహ్మద్ మరియు కుబేర స్వామి, వసీమ్ సాహెబ్, నరేంద్ర యాదవ్ పాల్గొన్నారు.
News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




