News
నిర్మాణంలో అవినీతి మాయ.. నాణ్యత లోపం CPM విమర్శ
ఆదోని పట్టణానికి త్రాగునీరు అందించే ఉద్దేశంతో 2002-2005 మధ్యలో నిర్మించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణంలో నాణ్యత లోపించిందని అందువల్లనే ఇప్పటికి మూడుసార్లు కట్ట కృంగిపోవడం జరిగిందని, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పీఎస్ రాధాకృష్ణ ఆరోపించారు. కుంగిపోయిన ఎస్ఎస్ ట్యాంకు కట్టను సిపిఎం ప్రతినిధి బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో మంచినీటి సమస్య పరిష్కారం కోసం, ఎస్ ఎస్ ట్యాంక్ నిర్మించాలని, సిపిఎం తోపాటు ఇతర రాజకీయ పార్టీలు, రెండు దశాబ్దాలుగా పోరాట ఫలితంగా, 2000 సంవత్సరంలో ఎస్ఎస్ ట్యాంక్ మొదలై 36 కోట్ల రూపాయలతో నిర్మించిన ఎస్ ఎస్ ట్యాంకు స్థాయిలో పట్టణ ప్రజల దాహార్తి పూర్తిస్థాయిలో తీర్చకముందే, ట్యాంకు కట్ట 2021లో రెండుసార్లు, ప్రస్తుతం 2023లో దాదాపు 100 మీటర్లు కట్ట కృంగిపోయినది ఇంకా 300 మీటర్లు కుంగి కూలిపోవడానికి సిద్ధంగా ఉందని దీనివల్ల కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఎస్ ఎస్ ట్యాంక్ కట్ట నిర్మాణంలో స్లాబ్ పద్ధతి కాకుండా రాళ్లతో పేడ్చి కట్టాలని దానివల్ల 100 సంవత్సరాలైనా కట్టకు ఎటువంటి ప్రమాదం ఉండదని దీనికి ఉదాహరణ ఆదోని రాంజల్లా చెరువు అని తెలిపారు. ఎస్ ఎస్ ట్యాంక్ నిర్మాణం సందర్భంగా ఉన్న ఇంజనీర్, ప్రజాప్రతినిధి, కాంట్రాక్టర్ పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టి, కారకులపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కట్ట కుంగిపోవడంతో నీటి నిలువలు చేసుకునే అవకాశం లేదని, దీనివల్ల ఆదోని పట్టణానికి త్రాగునీటి సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా పట్టణ కార్యదర్శి డి లక్ష్మన్న, మండల కార్యదర్శి లింగన్న, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ గోపాల్, ము, పట్టణ కమిటీ సభ్యులు నాగరాజు, వీరేష్, వెంకటేష్ పాల్గొన్నారు.


News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




