News
మూడవ భార్య కూడా కాపురానికి రాదేమో అని జీవితం పై విరక్తి
కర్నూలు జిల్లా ఆదోని మండలం ఇస్వి రైల్వే స్టేషన్ సమీపంలో లైన్ KM NO: 495/33 వద్ద వాల్మీకి నగర్కు చెందిన బోయ వీరేశ్ (38) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి. వాల్మీకి నగర్కు చెందిన వీరేశ్ (38) తండ్రి బోయ కిష్టప్ప అతడు మద్యానికి బానిసై ఇంట్లో గొడవ పడుతోండగా, భార్య రాజమ్మ ఎన్నో సార్లు బ్రతిమాలిన మారనందున భార్య పుట్టింటికి వ్వెళ్లిపోవడం తో విరేశ్ మద్యానికి బానిసై తన మూడో పెళ్ళాము కూడా కాపురానికి రాదేమో అని జీవితము పై వీరక్తి చెంది శనివారం 24వ తేది ఆదోని – ఇస్వి RSS ల మద్య ఎదో ఒక గుర్తు తెలియని రైలు లేదా గూడ్స్ కింద పడి ఆత్మహత్య చేసుకొని రక్తగాయలతో చనిపొయినాడు అని ఎస్ఐ రామస్వామి వివరాలు వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నామని ఎస్ఐ రామస్వామి తెలిపారు.

News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




