News
తుంగభద్ర డ్యాం 3 గేట్లు ఎత్తిన దిగువకు నీరు
తుంగభద్ర డ్యాం 3 గేట్లు ఎత్తిన దిగువకు నీరు..
కర్ణాటక: తుంగభద్ర: 22.07.2024
అధికారులు తెలిపిన సమాచారం మేరకు
నీటి నిలువ ప్రస్తుతం : 87.056 టీ.ఎం.సీ లు
3 గేట్లు 1 అడుగు ఔట్ ఫ్లో : 3987 క్యూసెక్కులు
నదికి ఔట్ ఫ్లో: 7744 క్యూసెక్కులు
ప్రస్తుతం నీటిమట్టం : 1628.09 అడుగులు

కర్ణాటక: తుంగభద్ర: తుంగభద్ర డ్యామ్ మూడు గేట్లు ఒక అడుగు ఎత్తి దిగువకు నీళ్లు వదిలారు అధికారులు. ముందుగా పూజలు నిర్వహించి హెచ్ ఎల్ సి ఎల్ఐసి కెనాల్ లకు నీళ్లు వదిలారు అనంతరం తుంగభద్ర డాం మూడు గేట్లను ఒక్క అడుగు మేర పైకెత్తి నదిలోకి నీళ్లు వదిలారు డామాధికారులు.

ఎగువన వర్షాలు కురుస్తుండడంతో తుంగభద్ర రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు పోటెత్తింది. ప్రతిరోజు సుమారుగా 1 లక్ష 24 వేల 129 క్యూసెక్కుల నీరు డ్యామ్ కు చేరుతుంది. పైనుంచి వస్తున్న వరద నీటితో తుంగభద్ర రిజర్వాయర్లోకి ఇన్ఫ్లో పెరగడంతో మిగులు నీటిని తుంగభద్ర డ్యాం గేట్లు ఎత్తే నదిలోకి సోమవారం సాయంత్రం వదిలారు. తుంగభద్ర నది కి ఆనుకుని ఉన్న దిగువ గ్రామాలలోని సంబంధిత అధికారులు మరియు ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని డ్యాం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.



News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




