News
పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి
కర్నూలు జిల్లా ఆదోని మండలం బసాపురం ఎస్ ఎస్ బ్యాంక్ సమీపంలో జగనన్న పచ్చ తోరణం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జయ మనోజ్ రెడ్డి పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా జయ మనోజ్ రెడ్డి మాట్లాడుతూ 5 ఎకరాల్లో సుమారు 800 మొక్కలను నాటినట్లు తెలిపారు. ఎన్ఆర్జిఎస్ ఫండ్ ఉపాధి హామీ పథకం మరియు సెంట్రల్ గవర్నమెంట్ మెయింటెనెన్స్ ఫండ్స్ ఇస్తుందని దీని ద్వారా రాష్ట్రమంతా పచ్చ తోరణం గా మారుతుందని ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గీతావాణి, మున్సిపల్ చైర్ పర్సన్ శాంత, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు.


News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




