News
హత్య కేసులో జీవిత ఖైదు విధించిన ఆదోని II ADJ court జడ్జి P. J. సుధా
కర్నూలు జిల్లా చిప్పగిరి మండల పరిధిలోని డేగులపాడు గ్రామానికి చెందిన దయ్యాల వెంకటస్వామికి జీవిత ఖైదు విధించిన ఆదోని రెండవ అడిషనల్ డిస్టిక్ట్ కోర్టు జడ్జ్ P. J. సుధా. చిప్పగిరి ఎస్సై మల్లికార్జున తెలిపిన వివరాల మేరకు 3/6/2021 సంవత్సరంలో డేగులపాడు గ్రామానికి చెందిన దయ్యాల వెంకటస్వామి అనే వ్యక్తి తాగుడుకు బానిసై తనకు మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో భార్యను రోకలితో కొట్టి హత్య చేసినట్టు కేసు నమోదు అయిందని, నేరం రుజువు కావడంతో ఆదోని రెండవ అడిషనల్ డిస్టిక్ట్ కోర్టు జడ్జ్ P. J. సుధా జీవిత ఖైదు విధించినట్లు ఎస్సై తెలిపారు,
పనితీరులో మంచి ప్రతిభ కనబరచిన చిప్పగిరి SI K.మల్లికార్జున ను మరియు కోర్టు కానిస్టేబుల్ భాస్కర్ ను జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ అభినందించినరు.
చిప్పగిరి PS క్రైమ్ నెంబర్ 85/2021 U/S 498(A), 302 IPC and SC No. 45/2022 కేసు లో ఈ రోజు 2023 జూన్ 21 వ తేదీన ఆదోని II ADJ court జడ్జి P. J. సుధా తీర్పు వెలువడించినారు.
News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




