News
భారత దేశంలో ప్రతి రోజూ 8 మంది అపహరణకు గురి అవుతున్నారు

కర్నూలు జిల్లా ఆదోనిలో శనివారం ఫెయిత్ హోమ్ ఫర్ చిల్రెన్ మరియు ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ది మ్యుమెంట్ ఆఫ్ ఇండియా, ఢిల్లీ వారి ఆధ్వర్యంలో భారత దేశంలో ఏక కాలంలో 15 రాష్ట్రాలలో, 100 పైగా ప్రదేశాల్లో, మానవ అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్) మీద జరిగిన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథితులుగా ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, డి.ఎస్. సోమన్న పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి జెండా ఊపి ర్యాలీ నీ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ భారత దేశంలో ప్రతి రోజూ 8 మంది అపహరణకు గురి అవుతున్నారని, వారిలో అమ్మాయిలు మరియు మహిళల సంఖ్య 90% ఉందని కావున విద్యార్థులు జాగ్రత్తగా నడుచుకోవాలని హెచ్చరించారు.ఈ ర్యాలీ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల నుండి ప్రారంభమై ఎమ్మిగనూరు సర్కిల్ వరకు సాగి అక్కడ మానవ హారంగా ఏర్పడి ప్రజలను చైతన్య వంతులను చేసే స్లొగన్స్ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫెయిత్ హోమ్ నిర్వాహకులు Dr. డేనియల్ ప్రేమ్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ బాలస్వామి, nss అధికారులు జోనాథన్, ఉమాదేవి, వెంకట్రమి రెడ్డి, NCC అధికారులు కెప్టెన్ గోవిందు, లెఫ్టినెంట్ ఈరమ్మ, LGA సభ్యులు, ప్రేమ్ కుమార్, మనోజ్, సలోమీ, అనితా, ఉష విద్యార్థులు పాల్గొన్నారు.





News
పొలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడుబూరు మండలం గవి గట్టు గ్రామంలో పొలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో నీలకంఠ, బంగారయ్య ఇద్దరికీ గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నీలకంఠ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి పొలం విషయంలో పక్కన పొలంలో ఉన్న ఐదు మంది వ్యక్తులు ఇద్దరు మహిళలతో కలిసి వారిపై దాడి చేశారని తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

News
సుపరిపాలనకు కేరాఫ్ చంద్రబాబు.. గడ్డా ఫక్రుద్దీన్

కూటమి నేతృత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుపరిపాలనకు కేరాఫ్ గా నిలిచాడని టిడిపి ఎ పి రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి,గుంతకల్లు మైనారిటీ పరిశీలకుడు గడ్డా ఫక్రుద్దీన్ అన్నారు.

కర్నూలు జిల్లా ఆదోనిలో బుదవారం గడ్డా ఫక్రుద్దీన్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలకు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ, ఇవ్వని హామీలను అమలు చేస్తూ ప్రజల చేత మన్ననలు పొందుతున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంటింటా సుపరిపాలన పేరిట గడప గడప కు తిరిగి సమస్యలను తెలుసుకోవడం జరిగిందన్నారు. మంత్రి వర్గంలో తీసుకున్న 9 అంశాలలో బ్రిటిష్ వారి నుండి స్వేచ్ఛ వాయువు పీల్చిన రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం అమలు,సత్ప్రవర్తన కలిగి ఉండడంతో 17 మంది జీవిత ఖైదీలకు విముక్తి, రాష్ట్ర వ్యాప్తంగా 2048 ఎస్పీఎఫ్ పోలీసు లకు హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి, ఆటో డ్రైవర్ల తో సమావేశం ఏర్పాటు లాంటి సాహోసపేతమైన నిర్ణయాలు తీసుకున్న పరిపాలనాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు.
News
కాలేజ్ ప్రాంగణంలో నెట్వర్క్ టవర్ను తొలగించాలి విద్యార్థి సంఘాల డిమాండ్

కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నెట్వర్క్ టవర్ను వెంటనే తొలగించాలి DSF, PDSO, RPSF విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. PDSO రాష్ట్ర నాయకుడు తిరుమలేష్ DSF జిల్లా అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ RPSF జిల్లా అధ్యక్షుడు బాలు మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యానికి హానికరం అంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు.
కాలేజ్ మైదానంలో టవర్ ఉండటం వల్ల విద్యా వాతావరణం ప్రభావితం అవుతోందని వారు తెలిపారు. ఆర్ట్స్ కళాశాల మేనేజ్మెంట్ చొరవ చూపి వెంటనే స్పందించి తక్షణమే టవర్ను తొలగించాలని కోరారు. టవర్ ను తొలగించ లేకపోతే విద్యార్థులు అందరినీ సమీకరించి రానున్న రోజుల్లో బందుకు పిలుపునిస్తామని విద్యార్థి సంఘాలుగా ఆర్ట్స్ కళాశాల మేనేజ్మెంట్ కు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు షకీల్ వినీల్ రాజ్ కుమార్ నవీన్ వినోద్ మురళి తదితరులు పాల్గొనడం జరిగింది

-
News4 weeks ago
స్కూల్ కాలేజీల దగ్గర గుట్కాలు, సిగరెట్లు అమ్మితే చర్యలు
-
News4 weeks ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 09-07-2025
-
News4 weeks ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 10-07-2025
-
News3 days ago
ఆటో అదుపుతప్పి బోల్తా
-
News4 weeks ago
కోట శ్రీనివాసరావు కన్నుమూత
-
News10 hours ago
పొలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
-
News4 weeks ago
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
-
Business4 weeks ago
Gold, Silver Price బంగారు ధర