News
అక్రమంగా ఎర్ర మట్టిని తవ్వుకొని సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు
◆ కొండల్లో అనుమతులు లేకుండా తవ్వకాలు..
◆ అక్రమంగా ఎర్ర మట్టిని తవ్వుకొని సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు..
◆ దెబ్బతింటున్న ప్రకృతి పర్యావరణం..

కర్నూలు జిల్లా ఆదోని చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంత కొండల్లో అనుమతులు లేకుండా అక్రమంగా ఎర్రమట్టి తవ్వకాలకు పాల్పడుతున్నారని దీనివల్ల పర్యావరణం దెబ్బతింటుందని సిపిఎం పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగుట్ట పాండురంగ స్వామి కొండ, ఆంజనేయ స్వామి విగ్రహం కొండ, దొడ్డనకేరి రూట్ లో ఉన్న ఎల్లమ్మ కొండలు, దిబ్బనకల్లు, గోనబావి, కడితోట, పరిసర కొండల్లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఎర్ర మట్టిని తవ్వుకొని సొమ్ము చేసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం పట్టణ కార్యదర్శి డి లక్ష్మన్న, మండల కార్యదర్శి కే లింగన్న, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ గోపాల్, తిప్పన్న, ఆవాజ్ నాయకులు ఎక్బల్ హుస్సేన్ ఆదోని తాసిల్దార్ శ్రీమతి వెంకటలక్ష్మి కి వినతిపత్రం అందజేశారు.
News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




