News
కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధికి 10 వేల కోట్ల కేటాయించలి
కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధికి 10 వేల కోట్ల రూపాయల కేటాయించాలని కోరుతూ ఆదోని నుండి కర్నూలు వరకు జూలై 26 నుండి 31 వరకు CPM పార్టీ చేపట్టిన మహా పాదయాత్రను జయప్రదం చేయాలని కోరుతూ ఆదోని మండలంలో 20 ,21, 22 తేదీల్లో జీపు జాతర ప్రారంభమైంది. గురువారం మాదిరె నుండి ప్రారంభమైం జీపు జాతను సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశులు ప్రారంభించారు. ఈ జీపు జాత మదిరే, చిన్న హరివణం, చిన్న గోనెహళ్, సంతే కుడ్లూరు, బలదురు, ఎడవల్లి, పెద్ద హరివాణం, హనవాళ్, జి. హోసల్లి,కడితో ట, ఇస్వి, బసాపురం, చాగీ, నారాయణ పురం, దనపురం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కే లింగన్న, సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు బి వీర రెడ్డి, మండల నాయకులు శేఖర్, తిక్కప్ప, శాఖా కార్యదర్శులు రామాంజనేయులు, శ్రీనివాసులు, లక్ష్మన్న, పార్టీ సభ్యులు రహిమాన్, హుస్సేని, ఉరుకుందు, హనుమంత రెడ్డి పాల్గొన్నారు.

News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




