News
పిఎం కిసాన్ సమాన్ నిధి ద్వారా 21 వేల మంది రైతులకు పెట్టుబడి సహాయం
పిఎం కిసాన్ సమాన్ నిధి ద్వారా ఆదోని మండలంలో 21 వేల7 వందల74 మంది రైతులకు రూ. 4 కోట్ల 35 లక్షల 48 వేలు డి బి టి ద్వారా నేరుగా రైతు ఖాతాలలో జమ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.
కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆరెకల్ గ్రామం లో పీఎం కిసాన్ సమాన్ నిధి కార్యక్రమాన్ని లైవ్ వెబ్ క్యాస్ట్ ద్వారా ప్రదర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసి నుండి 17వ విడత ప్రారంభ కార్యక్రమాన్ని లైవ్ వెబ్ క్యాస్ట్ ద్వారా రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ 2000/- రూపాయలను డి బి టి ద్వారా జమ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మరియు రైతులతో ముఖాముఖి నిర్వహించరు. ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పెట్టుబడి సాయాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి మండల వ్యవసాయ అధికారి అశోక్ కుమార్ రెడ్డి మరియు గ్రామ సర్పంచ్ వి. లోహిత ప్రియ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.



News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




