News
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులుగా వెల్లాల మధుసూధనశర్మ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య నూతన అధ్యక్షులుగా వెల్లాల మధుసూదన శర్మ ను బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. నెల్లూరులో జరిగిన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు ఇందులో నూతన అధ్యక్షులుగా వెల్లాల మధుసూదన శర్మ, ప్రధానకార్యదర్శి పోతావజ్జుల పురుషోత్తమశర్మ(తెనాలి) , కోశాధికారిగా శ్రీ కౌతా సుబ్బారావు(విజయవాడ) ఎన్నికయ్యారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా వెల్లాల మధుసూదన శర్మ మాట్లాడుతూ ఎన్నికకు సంహరించిన మాజీ అధ్యక్షులు శ్రీ జ్వాలాపురం శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి యనమండ్ర సాయీ సురేష్, కోశాధికారి శ్రీ పోతావజ్జుల పురుషోత్తమ శర్మ మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణ సంఘం నాయకులకు తనపై నమ్మకముంచి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రములో ఉన్న బ్రాహ్మణ సమస్యల పరిష్కారానికి తనవంతు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మధుసూదన శర్మ తెలియచేసారు.
మధుసూధనశర్మ అధ్యక్షులుగా ఎన్నికైనందుకు రాష్ట్రములోని వివిధ బ్రాహ్మణ సంఘాలు అభినందనలు తెలియచేసారు.

News
ఆదోని జిల్లా కోసం ఐదు నియోజకవర్గ లు బంద్
ఆదోని జిల్లా చేయాలనే డిమాండ్కు మద్దతుగా JAC (జాయింట్ యాక్షన్ కమిటీ) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆదోని బందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా 𝐘𝐒𝐑𝐂𝐏 రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మునిసిపల్ కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మీడియా తో మాట్లాడుతూ పార్టీ లకు అతీతంగా, కుల, మత భేదాలు లేకుండా ఆదోని జిల్లా సాధన లక్ష్యంగా ప్రజలంతా ఏకమై ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలిపారు. “ఆదోని జిల్లా – మన హక్కు” అనే నినాదంతో బందు కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించారని అన్నారు.


News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
