హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు

కర్నూలు జిల్లా ఆదోని కోర్టులో మహిళా హత్య కేసులో ముద్దాయి దేవదాస్ కు జీవిత ఖైదు తీర్పును వెల్లడించరు ఆదోని రెండవ అదనపు జిల్లా జడ్జి పి.జె. సుధా. 2021 జూన్ లో గోనెగండ్ల పోలీస్ స్టేషన్లో నమోదైన హరిజనలక్ష్మి అనే మహిళా హత్య కేసులో ఈ తీర్పును వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. బైలుప్పల గ్రామానికి చెందిన తల్లి కృష్ణమ్మ తన కూతురు హరిజనలక్ష్మి బంధువుల పెళ్లికాని వెళ్లి ఇంటికి రాలేదని 13 వ తేదీ జూన్ 2021 వ సంవత్సరం లో గోనెగండ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మిగనూరు రూరల్ సిఐ మంజునాథ్ Cr. No. 184/21 u/h wmen missing కేసుగా నమోదు చేసి దర్యాప్తులో భాగంగా కేసును 302 IPC గా మార్చి ముద్దాయిని అదుపులోకి తీసుకొని విచారించగా గోనెగండ్ల మండలం బి.అగ్రహారం గ్రామానికి చెందిన హరిజన హంద్రీ దేవదాసు (37), బైలుప్పల గ్రామానికి చెందిన హరిజనలక్ష్మి అను మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఆమె పై అనుమానం తో మృతురాలిని గుంతకల్లు చర్చికి వెళదామని దేవదాస్ మోటార్ సైకిల్ పై ఎక్కించుకొని కసాపురం సమీపాన గల అడివిలో మృతురాలితో గొడవపడి హత్య చేసి పెట్రోల్ తో ఆమెను కాల్చి ఆమెపై ఉన్నటువంటి బంగారు వెండి ఆభరణాలు తీసుకొని వెళ్ళినట్లు ముద్దాయి పోలీసులతో తన వాంగ్మూలంలో తెలిపినాడు. CI మంజునాథ ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరిచారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో ఆదోని రెండవ అదనపు జిల్లా జడ్జి పి జె సుధా ముద్దాయికి జీవిత ఖైదు విధిస్తున్నట్లు తీర్పును వెల్లడించారు.

ఇదే తరహా నేరంలో తెలంగాణ రాష్ట్రంలో షాద్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక అమ్మాయిని చంపినట్లు మరియు కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఒక కేసు ఉన్నాయని ఈ రెండు కేసులు కేసులు కోర్టు విచారణలో ఉన్నాయని జడ్జ్ పి జె సుధా తెలిపారు.

ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున పిపి మోతిలాల్ వాదనలు వినిపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top