News
ఆదోని వైసిపికి షాక్ ఇచ్చిన సర్పంచ్
కర్నూలు జిల్లా ఆదోని మండలం చిన్న పెండేకల్లు గ్రామ సర్పంచ్ జయరాం ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి చేతుల మీదుగా భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాదులో ఎమ్మెల్యే కార్యాలయంలో వెల్లాల మధుసూదనశర్మ, సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా జయరాం మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు ఆదోని నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథములో నడిడిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అందుకే మా చిన్నపెండేకల్లు గ్రామాన్ని కూడా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి సహాయ సహకారాలతో అబివృద్ధి చేసుకోవాలనే సంకల్పముతోనే భారతీయ జనతా పార్టీ లో చేరడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమములో వెల్లాల మధుసూదనశర్మ, సింహం నాగేంద్ర, కల్లుపోతుల సురేష్, దిబ్బనకల్లు రంగ, కౌన్సిలర్ చిన్న, నాగలాపురం సర్పంచ్ నాగిరెడ్డి, ధనాపురం సర్పంచ్ చంద్ర,గోవిందు, మహబూబ్ బాషా, శ్రీరాములు, నబీరసూల్, మొదలైన వారు పాల్గొన్నారు..


News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




