News
వైఎస్ఆర్సిపి కార్యాలయంలో పంద్రాగస్టు వేడుకలు
ఎందరో అమరవీరుల ప్రాణ త్యాగం తో గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆయన ఆశయాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ స్వరాజ్యాన్ని పేదలకు అందిస్తూ దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచారని ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు.
కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో 77 వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. జాతీయ జెండాను ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎగరవేశారు. అనంతరం ఎస్ఈఆర్పి(SERP) వైఎస్ఆర్ క్రాంతి పథకంలో ఉద్యోగస్తులకు ఫిట్మెంట్ 23 శాతం పెంపు చేసినందుకు ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే కు శాలువా కప్పి సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటామని ఉద్యోగులు అన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి ఆదోని పట్టణ అధ్యక్షులు బి. దేవా జిల్లా వాఫ్ బోర్డు చైర్మన్ నియాజ్ అహ్మద్ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ భాష, స్టేట్ డైరెక్టర్లు అహ్మద్ భాషా అను భాష రామలింగేశ్వర్, జులేఖబీ, శ్రీదేవి, ప్రజ్ఞ సుగుణ, మహేశ్వరి, ఫర్హాద్ భాను శోభలత కౌన్సిలర్లు చలపతి, చిన్న, తదితరులు పాల్గొన్నారు

News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




