News
దళిత మహిళను హత్య చేసిన ముద్దాయిలు అరెస్టు
కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగనాతన హల్లిలో జులై 12 తేదీ గుండమ్మ అనే దళిత మహిళ హత్య కేసులో 6 మంది నిందితులను డీఎస్పీ శివ నారాయణ స్వామి అరెస్టు చేసి విలేకరుల ముందు హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు. డిఎస్పి తెలుగుని వివరాల మేరకు గుండమ్మ అనే మహిళను ట్రాక్టర్ తో గుద్ది ఆమెపై ట్రాక్టర్ ఎక్కించి చంపారని మరియు పురుషోత్తమ్ రెడ్డిని కట్టే తో కొట్టి తీవ్రంగా గాయపరిచిన ముద్దాయిలను ఆదోని పట్టణం సిరుగుప్ప క్రాస్ రోడ్డు దగ్గర A1 ). జడ్ల శ్రీధర్ రెడ్డి, A2). జడ్ల రాఘవేంద్ర రెడ్డి, A3). జడ్ల సోమ శేఖర్ రెడ్డి, A4). బి. సుబ్బా రెడ్డి @బిసెటి సుబ్బా రెడ్డి, A5). హెబ్బటం రామకృష్ణ @ బోయ రామకృష్ణ, A6). దాసరి గోవిందరాజు @ దాసరి గోవిందు లను అరెస్టు చేసి జుడిషియల్ కోర్టు జడ్జి ముందు హాజరు పరిచయం రిమాండ్కు తరలిస్తున్నామని అదేవిధంగా హత్యకు ఉపయోగించిన AP99-TU- 0407 ట్రాక్టర్ ను సీజ్ చేసినట్లుగా తెలిపారు.
పూర్తి వివరాల్లోకి వెళితే:
డిఎస్పి శివ నారాయణ స్వామి తెలిపిన వివరాల మేరకు నాగనాతనహళ్లి గ్రామం సర్వేనెంబర్ 500/ D లోని 04 ఎకరాల పొలమును తిరుమలమ్మ W/o సోమశేఖర్ రెడ్డి నుండి నాగనాతనహళ్లి గ్రామానికి చెందిన మాదిగ గుండమ్మ W/o శ్రీనివాసులు అను ఆమె 2019 సంవత్సరం లో భూమి కొనుగోలు చేసి, 2022వ సంవత్సరంలో ఆమె కొడుకైన N. కిషోర్ కుమార్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకొన్నారు. అయితే ఈ భూమి విషయంగా గతంలో తిరుమలమ్మ మరియు రాఘవేంద్ర రెడ్డి కి మధ్య వివాదాలు ఉండడంతో ఆదోని సివిల్ కోర్టు నందు సివిల్ కేసు నంబరు O.S No: 50/17 గా వ్యాజ్యము నడుస్తూన్నాయి. వివాదాలు ఉండడం వల్ల భూమిని తిరుమలమ్మ, గుండమ్మకు అమ్మడంతో అప్పటినుండి భూమిని గుండమ్మ సాగు చేసుకుంటూ ఉన్నది. ఈ క్రమంలో జులై 12 తేదీ ఉదయం గుండమ్మ ఆమె కుమారుడు కిషోర్ మరియు కల్లుబావికి చెందిన పురుషోత్తం రెడ్డి ముగ్గురు పొలము వద్ద ట్రాక్టర్ తో ఉన్న సమయంలో నాగనాతనహళ్లి కి చెందిన రాఘవేందర్ రెడ్డి మరియు అతని కుమారుడు శ్రీధర్ రెడ్డి మరియు ఇంకా 4 వ్యక్తులు తమ ట్రాక్టర్ తీసుకుని గుండమ్మ దున్నుతున్న పొలం వద్దకు వెళ్లి ఆ భూమి మాకు కూడా చెందుతుందని మేము కూడా దున్నుతామని గుండమ్మతో వాదిస్తూ రాఘవేంద్ర రెడ్డి కుమారుడు శ్రీధర్ రెడ్డి తన ట్రాక్టర్ తో గుద్ది. ఆమెపై ట్రాక్టర్ ను ఎక్కించి చంపినాడు, మరియు రాఘవేందర్ రెడ్డి కట్టే తో పురుషోత్తమ్ రెడ్డిని కొట్టి తీవ్రంగా గాయపరిచారు.
గుండమ్మ కొడుకైన N. కిషోర్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆదోని రూరల్ CI, G. నిరంజన రెడ్డి గారు పై ఫిర్యాదు పై ఇస్వి పి.ఎస్ Cr.No. 101/2024 U/Sec 103, 109, 329(3), r/w 3(5) BNS and Sec 3(1)(f)(s), 3(2)(v) of SC/ST (POA) Amendment Act-2015 కేసు నమోదు చేశారు.
కర్నూల్ జిల్లా SP కృష్ణకాంత్ పర్యవేక్షణలో దర్యాప్తు అదికారి అయిన SDPO జె. శివనరాయణస్వామి, ఆదోని 2 టౌన్ CI గోపి, ఆదోని రూరల్ CI నిరంజన రెడ్డి, ఇస్వి SI శ్రీనివాసులు 15-07-2024వ తేదీన ఉదయం 11.00 గంటల, ఆదోని టౌన్ లోని, సిరుగుప్ప క్రాస్ రోడ్డు దగ్గరలో ముద్దాయులు
A1 ). జడ్ల శ్రీధర్ రెడ్డి, తండ్రి పేరు జడ్ల రాఘవేంద్ర రెడ్డి, వయసు 19 సంలు, నాగనాతనహళ్లి గ్రామము, ఆదోని మండలం,
A2). జడ్ల రాఘవేంద్ర రెడ్డి, వయస్సు 53 సంలు తండ్రి పేరు లేట్ శివ శంకర్ రెడ్డి, నాగనాతనహళ్లి గ్రామము, ఆదోని మండలం,
A3). జడ్ల సోమ శేఖర్ రెడ్డి, వయస్సు 42 సంలు తండ్రి పేరు లేట్ శివ శంకర్ రెడ్డి, నాగనాతనహళ్లి గ్రామము, ఆదోని మండలం,
A4). బి. సుబ్బా రెడ్డి @బిసెటి సుబ్బా రెడ్డి, వయసు 50 సంలు, తండ్రి పేరు చెన్నా రెడ్డి, నాగనాతనహళ్లి గ్రామము, ఆదోని మండలం,
A5). హెబ్బటం రామకృష్ణ @ బోయ రామకృష్ణ, వయసు 40 సంలు, తండ్రి పేరు నాగప్పు, నాగనాతనహళ్లి గ్రామము, ఆదోని మండలం,
A6). దాసరి గోవిందరాజు @ దాసరి గోవిందు, వయసు 27 సంలు, తండ్రి పేరు తిమ్మయ్య@ తిమ్మప్ప, నాగనాతనహళ్లి గ్రామము, ఆదోని మండలం.
వీరిని అదుపులోకి తీసుకొని విచారించి వారి నుండి హత్యకు ఉపయోగించిన ట్రాక్టర్ AP99-TU- 0407 ను మరియు కట్టెను సిరుగుప్ప క్రాస్ సమీపంలో వైపుల భాస్కర్ రెడ్డి ఖాళీ పొలంలోగల ముళ్ళ పొదలలో పంచాయతీదారుల సమక్షంలో స్వాదినం చేసుకొని ముద్దాయిలను అరెస్టు చేసి ఆదోని రెండవ అదనపు JFCM కోర్ట్ జడ్జి ముందు హాజరు రిమాండ్ కు తరలించారు.

News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




