News
పత్తికొండ మండలంలో దారుణ హత్య
కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో దారుణ హత్య జరిగింది. హోసూరు గ్రామానికి చెందిన వాకిటి శ్రీనివాసులు అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత మార్చారు. హోసూరు మాజీ సర్పంచ్ వాకిటి శారద భర్త శ్రీనివాసులు టిడిపి పార్టీలో క్రియాశీలకంగా పనిచేసేవారు.

తెల్లవారుజామున రోజువారి కాలకృత్యాలు తీర్చుకునే క్రమంలో బహిర్భూమికి వెళ్లిన ప్రత్యర్థులు కాపుకాసి అంతమందించారు. శ్రీనివాసులు హత్యకు ప్రధాన కారణం తెలియ రాలేదు. అయితే గ్రామంలో పార్టీలకు అతీతంగా శ్రీనివాసులు హత్య జరిగిన ప్రాంతానికి అన్ని పార్టీలకు చెందిన గ్రామ నాయకులు వచ్చి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పత్తికొండ ఎమ్మెల్యే శ్యాం కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించారు. డిఎస్పి శ్రీనివాసులు ఈ విషయంపై మాట్లాడుతూ గ్రామంలో రాజకీయ హత్యలు జరిగే పరిస్థితి లేదని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని అన్నారు.
News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




