కర్నూలు జిల్లా కోసిగి మండలం గౌడుగలు గ్రామంలో పొలం రస్తా విషయంలో దావీదు, యల్లప్ప ఘర్షణకు పాల్పడ్డారు. దావీదు వర్గంపై , యల్లప్ప వర్గం కర్రలు కత్తులతో దాడులు చేశారు.ఈ దాడుల్లో దావీదు వర్గంలో నలుగురికి గాయాలుకావడంతో ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



