కర్నూలు జిల్లా ఆదోనిలో వాలంటీర్లు పవన్ కళ్యాణ్ శవయాత్ర చేపట్టి దిష్టిబొమ్మను దగ్ధం చేసినందుకు జనసేన నాయకులు సి.యం డౌన్ డౌన్ అంటూ నిరసన ర్యాలీ చేపట్టారు. ఆదోని భీమస్ సర్కిల్లో పవన్ కళ్యాణ్ కు నిప్పు పెట్టిన స్థలంలో పసుపు నీళ్లు చల్లి పోస్టర్ కు పాలాభిషేకం చేసి జనసేన నాయకులు నిరసన తెలిపారు.
పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దగ్ధం
కర్నూలు జిల్లా ఆదోనిలో పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వాలంటీర్లు మునిసిపల్ కార్యాలయం నుండి ప్రధాన రహదారుల గుండా పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ అంటూ ర్యాలీ చేపట్టారు. అనంతరం భిమాస్ సర్కిల్లో పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దగ్ధం చేశారు. వాలేంటీర్ల పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని వాలేంటీర్లకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని వాలేంటీర్లు డిమాండ్ చేశారు.



