News
సంక్షేమ పథకాలు అమలు చేయడంలో టిడిపి పెట్టింది పేరు. గడ్డా ఫక్రుద్దీన్
సంక్షేమ పథకాలు అమలు చేయడంలో టిడిపి పెట్టింది పేరని టీడీపీ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి, అనంతపురం జిల్లా గుంతకల్ మైనార్టీ అబ్జర్వర్ షేక్ బాబా ఫక్రుద్దీన్ అలియాస్ గడ్డా ఫక్రుద్దీన్ ఆనందం వ్యక్తం చేశారు.
కర్నూలు జిల్లా ఆదోనిలో షేక్ బాబా ఫక్రుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ ఆనాడు అన్న ఎన్టీఆర్ కిలో రెండు రూపాయలు బియ్యంతో సంక్షేమ పథకం తో చరిత్ర సృష్టిస్తే ఈసారి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తల్లికి వందనం అనే సంక్షేమ పథకాన్ని అమలు చేసి నారా చంద్రబాబు నాయుడు చరిత్ర సృష్టించారని తెలిపారు. సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అనే సంక్షేమ పథకాన్ని అమలు చేసి చూపించారని కొనియాడారు. ఆనాడు జగన్ ప్రభుత్వం నాలుగేళ్లలో వేసినా అమ్మ ఒడి ఈరోజు కూటమి ప్రభుత్వం ఒకే సంవత్సరంలో తల్లికి వందనం వేసి తల్లుల కళ్ళల్లో ఆనందాన్ని కూటమి ప్రభుత్వం చూడగలిగింది అన్నారు. పిల్లల్ని చదివిస్తే రాష్ట్రానికి అతిపెద్ద సంపద వారేనని నమ్మి ఆచరణలో పెట్టి చూపిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే బులుగు బ్యాచ్ కూటమి ప్రభుత్వంపై విషం కక్కుతుంది, కడుపు మంటతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని 2000 రూపాయలు లోకేష్ బాబు జేబులోకి పోయాయంటూ వైసీపీ నేతలు దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గత ప్రభుత్వం వైసీపీ పాలనలో 13000 ఇచ్చారు అంటే 2000 జగన్ జేబులోకి పోయినాయా? లేదంటే తాడేపల్లి ప్యాలెస్సుకుపోయినాయని? ఈ సందర్భంగా గడ్డా ఫక్రుద్దీన్ ప్రశ్నించారు? గత ప్రభుత్వం జగన్ పాలనలో 47 లక్షల మందికి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం 67 లక్షల మందికి ఈ పథకం లబ్ధి పొందురున్నారని అయితే గత ప్రభుత్వంలో కుటుంబంలో ఇద్దరు పిల్లలుంటే ఇద్దరు పిల్లలకి అమ్మఒడిఅమలు చేస్తానని చెప్పి కుటుంబంలో ఒక్కరికే అమ్మ ఒడి అమలు చేసి మధ్య తరగతి కుటుంబాలను మోసం చేసిన ఘనత జగన్ కి దక్కుతుందని అన్నారు. అయితే కూటమి ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధిని చూసి జగన్ మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేయడం జగన్ దిగజారుడు రాజకీయానికి నిదర్శమని ఇప్పటికైనా వైసీపీ నాయకులు ఇలాంటి తప్పుడు ఆరోపణలు మానుకోవాలని గడ్డా ఫక్రుద్దీన్ హితువు పలికారు.
News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




