★ సాధారణంగా విజయం సాధించిన వారు చరిత్ర సృష్టిస్తారు కానీ ఈ వ్యక్తి మాత్రం ఓడిపోయి రికార్డు సృష్టించాడు. 239 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి ఎలక్షన్ కింగ్ ఆఫ్ ఇండియా అని పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు మోస్ట్ అన్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్ గా ఎక్కువ సార్లు ఎలక్షన్స్ లో ఓడిపోయిన వ్యక్తిగా ఇతనికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా లభించింది.
★ సామాన్య ప్రజలు కూడా ఎలక్షన్స్ లో పాల్గొనవచ్చు అని అవేర్నెస్ తీసుకురావడానికి చేస్తున్న నా ప్రయత్నం.. తమిళనాడుకు చెందిన పద్మరాజన్
తమిళనాడుకు చెందిన పద్మరాజన్ ఒక టైర్ పంచర్ రిపేర్ షాప్ ఓనర్ ఇతను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 239 సార్లు ఎన్నికల్లో పోటీ చేశాడు కానీ అన్ని సార్లు ఓడిపోయాడు. 1988 నుండి ఇప్పటివరకు లోకల్ ఎలక్షన్స్ నుండి లోక్సభ ఎలక్షన్స్ వరకు చివరికి ప్రెసిడెన్సీ ఎలక్షన్స్ లో కూడా పోటీ చేశాడు. అలా ఈయన 6 ప్రెసిడెన్షియల్ 6 వైస్ ప్రెసిడెన్షియల్ 32 లోక్సభ 50 రాజ్యసభ 73 పార్లమెంటరీ ఎలక్షన్స్ లలో పోటీ చేశాడు.
ఇతను వాజ్పేయ్, పివి నరసింహారావు, జయలలిత, కరుణానిధి, అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీ, రాహుల్ గాంధీ, విజయకాంత్, మోదీ ఇలా ఎంతో మంది ప్రముఖుల మీద పోటీ చేశాడు. అయితే ఎలక్షన్స్ లో నామినేషన్స్ వేసేటప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ గా కొంత అమౌంట్ పే చేయలి ఆ నగదును తన టైర్ పంచర్ రిపేర్ షాప్ ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఎలక్షన్ నామినేషన్స్ కోసం సెక్యూరిటీ డిపాజిట్లు సుమారుగా 80 లక్షల రూపాయల వరకు ఖర్చు అయిందట.
ఇన్ని ఎలక్షన్స్ లో పాల్గొన్నా కానీ ఒక్కసారి కూడా ఎలక్షన్స్ క్యాంపెయిన్ చేయలేదు నామినేషన్స్ వేసిన ప్రతిసారి ఓడిపోవాలని కోరుకుంటారట మరి ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే సామాన్య ప్రజలు కూడా ఎలక్షన్స్ లో పాల్గొనవచ్చు అని అవేర్నెస్ తీసుకురావడానికి ఇతను ఇలా పోటీ చేస్తున్నాడట ఓడిపోతున్నా సరే పట్టించుకోకుండా ఇన్ని ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నాడు కాబట్టి ఇతనికి ఎలక్షన్ కింగ్ ఆఫ్ ఇండియా అని పేరు వచ్చింది అంతేకాదు మోస్ట్ అన్ సక్సెస్ఫుల్ కాండిడేట్ గా ఎక్కువ సార్లు ఎలక్షన్స్ లో ఓడిపోయిన వ్యక్తిగా ఇతనికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా లభించింది.