Connect with us

News

హైవే రోడ్ లో బైఠాయించి నిరసన.. అడ్డుకున్న పోలీసులు

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మెడికల్ కాలేజ్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మెడికల్ కాలేజ్ ప్రవెటీకరణను వ్యతిరేకిస్తు పి డి ఎస్ యు విద్యార్థి సంఘాలు హైవే రోడ్ పై బైఠాయించి రాస్తారోకో చేస్తున్న నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నరు. పోలీసులకు విద్యార్థి సంఘాల నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మెడికల్ కాలేజ్ పై కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పి పి పి పద్ధతిని రద్దు చేయాలి, వెంటనే కాలేజ్ పనులు పూర్తిచేసి తరగతులు ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు.

మెడికల్ కాలేజ్ ముందు నిరసన తెలుపుతున్న పి డి ఎస్ యు సంఘం నాయకులు విద్యార్థులు

ఈ సందర్భంగా పి డి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు కే భాస్కర్ మాట్లాడుతూ…
చంద్రబాబు 30 ఏళ్లుగా సీఎం గా ఉన్న ఇంతవరకు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకొని రాలేదు అన్నారు. కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిదురిస్తూ ఇస్తున్న 40%తో మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేLయలేక పోతుందని ఇది చేతకానితనానికి నిదర్శనమై అన్నారు. కార్పొరేటర్లకు బూడిదం చేస్తున్నార ఆని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం కార్పొరేట్ మెడికల్ మాఫియాకు అండగా మారిందని.. విద్యను నాశనం చేస్తున్న నారా లోకేష్ ను భర్తరాఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజ్ అమ్ముకొని దండుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారని చలనం లేకుండా ఉన్నాడని తెలిపారు. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఆపకపోతే సీఎం ఇల్లు మరియు అసెంబ్లీని ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

పోలీసులతో వాగు వివాదానికి దిగిన పి డి ఎస్ యు నాయకులు

పి డి ఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ మాట్లాడుతూ..
ప్రైవేటీకరణ ఆపకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కుటుంబ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్న వారిని లేపుతున్న పోలీసులు
రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్న వారిని లేపుతున్న పోలీసులు
పూర్తి వీడియో చూడాలి టెక్నిక్ క్లిక్ చేయండి
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

సహకార ఉద్యోగుల సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘం బాసట

Published

on

ఆదోని, ఫిబ్రవరి 21:ఆదోనిలోని డి.సి.సి.బి (DCCB) బ్యాంక్ ఎదుట తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సహకార సంఘాల ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం శనివారం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సమ్మె శిబిరాన్ని సందర్శించిన సంఘం నాయకులు ఉద్యోగుల పోరాటానికి సంఘీభావం తెలిపారు.

సభలో మాట్లాడుతున్న వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు లింగన్న

ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె. లింగన్న, మండల కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు:

  • వ్యవసాయానికి వెన్నెముక: గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి సాగు పెట్టుబడి నుంచి ఇతర సేవల వరకు ప్రాథమిక సహకార సంఘాలు ఎంతో మేలు చేస్తున్నాయని వారు కొనియాడారు.
  • ప్రభుత్వ బాధ్యత: సహకార వ్యవస్థను నిర్వీర్యం చేయకుండా, వాటిని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు గుర్తు చేశారు.
  • తక్షణ పరిష్కారం: గత కొంతకాలంగా తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు శాంతియుతంగా పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. వారి న్యాయమైన కోర్కెలను వెంటనే ప్రభుత్వం ఆమోదించాలని డిమాండ్ చేశారు.
సభలో మాట్లాడుతున్న వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు లింగన్న

ఈ కార్యక్రమంలో సహకార సంఘాల ఉద్యోగులు, కార్మిక సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

News

పోగొట్టుకున్న బ్యాగ్ను పోలీసులు ఒకే ఒక్క గంటలో రికవరీ

Published

on

ఆదోని, ఫిబ్రవరి 18:

ప్రయాణంలో అజాగ్రత్తగా వదిలేసిన లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఆదోని వన్ టౌన్ పోలీసులు కేవలం ఒకే ఒక్క గంటలో రికవరీ చేసి బాధితురాలికి అప్పగించారు. పోలీసుల వేగవంతమైన స్పందనపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

అసలేం జరిగిందంటే?  కౌతాలం నుంచి ఆదోనికి ఆర్టీసీ బస్సులో వచ్చిన ఓ మహిళ, విశాల్ మార్ట్ వద్ద దిగుతూ తన బ్యాగును బస్సులోనే మరిచిపోయింది. ఆ బ్యాగులో 6 లక్షల రూపాయల విలువైన 4 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. అయితే, ఆ తొందరలో తన వెంట తెచ్చుకున్న బ్యాగును బస్సులోనే మరిచిపోయారు. కొద్దిసేపటి తర్వాత బ్యాగు గుర్తుకు రావడంతో హుటాహుటిన బస్టాండ్‌కు చేరుకుని డ్రైవర్‌ను సంప్రదించారు. బస్సులో వెతికినప్పటికీ బ్యాగు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన బాధితురాలు సాయంత్రం 3:30 గంటలకు ఆదోని వన్ టౌన్ సీఐ పి. చంద్రశేఖర్ గారికి ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు.. బాధితురాలి ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన పోలీసులు బస్సు డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు విచారణ చేపట్టారు. పలు ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గాలింపు చేపట్టారు. సాయంత్రం 4:30 గంటలకు పోగొట్టుకున్న సొత్తును తిరిగి పొందిన బాధితురాలు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

Continue Reading

News

నాటు సారా స్థావరంపై పోలీసుల దాడి

Published

on

ఆదోని రూరల్, ఫిబ్రవరి 18:

కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా ఆదోని డీఎస్పీ శ్రీ హేమలత సూచనల మేరకు, రూరల్ సీఐ నల్లప్ప పర్యవేక్షణలో బుధవారం పెద్దతుంబలం పోలీసులు భారీ దాడులు నిర్వహించారు.

ఘటన వివరాలు:

​పెద్దతుంబలం ఎస్ఐ విద్యా శ్రీ, తన సిబ్బంది రంగస్వామి (PC-3603), రామకృష్ణ (PC-3637)లతో కలిసి దొడ్డనగిరి గ్రామ శివార్లలోని సిద్ధాపురం ఆంజనేయస్వామి గుడి సమీపంలో ఉన్న గుట్టల వద్ద తనిఖీలు చేపట్టారు. అక్కడ గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న నాటు సారా బట్టిని పోలీసులు గుర్తించారు. పోలీసుల రాకను గమనించిన నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు.

భారీగా ఊట ధ్వంసం:

​పోలీసులు సారా బట్టి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అక్కడ నిల్వ ఉంచిన ఊటను తక్షణమే ధ్వంసం చేశారు. అలాగే, ప్లాస్టిక్ క్యాన్లలో నిల్వ ఉంచిన 10 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

నిందితుడి గుర్తింపు:

​పోలీసుల ప్రాథమిక విచారణలో, సారా బట్టి నిర్వహిస్తున్న వ్యక్తి ఆదోని పట్టణానికి చెందిన నాగరాజు కుమారుడు బోయ శివగా తేలింది. స్థానిక పొలాల యజమానుల నుంచి సేకరించిన సమాచారం మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విద్యా శ్రీ తెలిపారు. అక్రమ మద్యం తయారీ మరియు రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

Continue Reading

Trending