News
పాండవగల్ గ్రామంలో 2వ వార్డ్ కు సిపిఎం ఏకగ్రీవంగా ఎన్నిక
ఆదోని మండలం పాండవగల్ గ్రామంలో గత 2021 ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థిగా 2వ వార్డుకు పోటీచేసి, తుంబలం మూకయ్య గెలుపొందారు. 2022 నవంబర్లో ఆయన అనారోగ్యంతో మృతి చెందారు.
2వ వార్డుకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. సిపిఎం తరపున తుంబలం ముకయ్య 2వ కుమారుడు తుంబలం వెంకటేశ్వర్లు
నామినేషన్లు దాఖలు చేశారు.
వారి నాయన మరణాంతరం జరుగుతున్న ఎన్నికలు కావడంతో వైసిపి టిడిపి జనసేన పార్టీలు అభ్యర్థులను నిలబెట్టకుండా తుంబలం వెంకటేశ్వర్లు కు మద్దతు ఇస్తామని చెప్పడంతో 2వ వార్డుకు వార్డు మెంబర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
2వ వార్డు ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థి తుంబలం వెంకటేశ్వర్లు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే.వెంకటేశ్వర్లు, సిపిఎం పార్టీ మండల నాయకులు రామాంజనేయులు, శాఖ కార్యదర్శులు పాండురంగ, అనిఫ్, గోవిందు వార్డు సభ్యులు కృష్ణ, స్థానిక కార్యకర్తలు హుసేని, మల్లి మాట్లాడుతూ రెండో వార్డును ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సహకరించిన వైసిపి టిడిపి జనసేన పార్టీల నాయకులు మరియు పాండవగల్ గ్రామ 2 వ వార్డు ఓటర్లకు, ప్రజలకు సిపిఎం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలిపారు.

News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




