News
జన జాగరణ కార్యక్రమం జయప్రదం చేయండి
◆ ఆగస్టు 14వ తేదీన దేశవ్యాప్తంగా జన జాగరణ కార్యక్రమం..
◆ బడా కార్పొరేటర్లకు కొమ్ముకాస్తున్న బిజెపి ప్రభుత్వం..
◆ మతతత్వ విధానాల ద్వారా ప్రజల్ని చీల్చి దేశాన్ని అధోగతి పాలు.. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కే వెంకటేశులు
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతులను కూలీలను కార్మికులను విస్మరించి బడా కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ, తన మతతత్వ విధానాల ద్వారా అన్ని వర్గాల ప్రజల్ని చీల్చి దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నదని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కే వెంకటేశులు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే లింగన్న తెలిపారు.
కర్నూలు జిల్లా ఆదోని సుందరయ్య భవన్లో శుక్రవారం మూడు సంఘాల సంయుక్త సమావేశం సిఐటియు మండల కార్యదర్శి బి వీరారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కే వెంకటేశులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే లింగన్న మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బడా కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ, మతతత్వ విధానాల ద్వారా అన్ని వర్గాల ప్రజల్ని చీల్చి దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా రైతు సంఘం, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆగస్టు 14వ తేదీన దేశవ్యాప్తంగా జన జాగరణ కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్నట్లు తెలిపారు. జన జాగరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో రైతు సంఘం మండల కార్యదర్శి అయ్యప్ప, సిఐటియు మండల అధ్యక్షులు జే. రామాంజనేయులు, రైతు సంఘం మండల నాయకులు భాష, కౌలు రైతు సంఘం మండల కార్యదర్శి దస్తగిరి బాషా, ఆటో వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి వీరేష్, కెవిపిఎస్ మండల నాయకులు పరమేష్, సిఐటియు నాయకులు ఉరుకుందు, ఏలియా తదితరులు పాల్గొన్నారు.
News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




