News
“తరం” (ది జనరేషన్)లఘు చిత్రం షూటింగ్ పూర్తి
హిందూ సంస్కృతి, సాంప్రదాయాలు, బ్రాహ్మణ ఆచార వ్యవహారాలు, బ్రాహ్మణుడి మెడలో ఉన్న యజ్ఞోపవీతం (జంధ్యం ) యొక్క పవిత్రతను తెలియచెప్పే ఇతివృత్తముతో పిసి ఆనంద్ గారి దర్శకత్వములో కొల్లూరి రవికిరణ్ నిర్మించిన లఘు చిత్రంతరం (ది జనరేషన్) భూదాన్ పోచంపల్లి మండలం జిబ్లక్ పల్లె గ్రామ పరిసర ప్రదేశాలతో పాటుగా తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పోచంపల్లి రమణారావు గారి గృహములో మూడు రోజులలో షూటింగ్ పూర్తి చేశారు.

ఈ లఘు చిత్రములో దుర్భాకుల సాయి కథానాయకుడితో పాటుగా ఆపన్నప్రదీపన బ్రాహ్మణ సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షులు వెల్లాల మధుసూదన శర్మ, రవికిరణ్, శ్రీనిధిరఘు, కలసపాటి లక్ష్మీ నారాయణ, శ్రవంతి, హర్షిత, కౌస్తుబ్, రమణ మొదలైన వారు నటించారు. ఈ సినిమా పూజకార్యక్రమములో జబ్లిక్ పల్లె సర్పంచ్ లచ్ఛిలింగస్వామి, ఉప సర్పంచ్ ఆర్ల లింగుస్వామి, పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




