యుద్ధభూమిలో వీరమరణం పొందిన వీరజవాన్ మురళీ నాయక్ పార్థివ దేహానికి కళ్లితండాలో మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం తన ప్రాణాలను అర్పించిన అమరజవాన్ మురళీ నాయక్ త్యాగం చిరస్మరణీయము అన్నారు. ప్రభుత్వం వారి కుటుంబానికి భరోసాగా నిలుస్తుందని తెలిపారు. ఈ దేశం మురళీ నాయక్ త్యాగాన్ని ఎప్పటికీ మరిచిపోదు అన్నారు.



