Connect with us

News

వీరజవాన్ మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించిన మంత్రి నారా లోకేష్

Published

on

యుద్ధభూమిలో వీరమరణం పొందిన వీరజవాన్ మురళీ నాయక్ పార్థివ దేహానికి కళ్లితండాలో మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం తన ప్రాణాలను అర్పించిన అమరజవాన్ మురళీ నాయక్ త్యాగం చిరస్మరణీయము అన్నారు. ప్రభుత్వం వారి కుటుంబానికి భరోసాగా నిలుస్తుందని తెలిపారు. ఈ దేశం మురళీ నాయక్  త్యాగాన్ని ఎప్పటికీ మరిచిపోదు అన్నారు.

వీరజవాన్ మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులర్పింస్తున్న మంత్రి నారా లోకేష్ .
వీరజవాన్ మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులర్పింస్తున్న మంత్రి నారా లోకేష్ .
వీరజవాన్ మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులర్పింస్తున్న మంత్రి నారా లోకేష్ .
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

DYFI ఆధ్వర్యంలో పాండవగల్లు బస్టాండ్ వద్ద రాస్తారోకో

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్లు గ్రామం నుండి ఎరిగేరి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల కోసం తక్షణమే ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాలని డివైఎఫ్ఐ (DYFI) డిమాండ్ చేస్తూ మంగళవారం పాండవగల్లు బస్టాండ్ ప్రధాన రహదారిపై విద్యార్థులు, నాయకులతో కలసి రాస్తారోకో నిర్వహించారు.

రాస్తారోకోతో నిలుబడిపోయిన వాహనాలు
వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

ఈ సందర్భంగా డివైఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు చిరంజీవి మాట్లాడుతూ… పాండవగల్లు గ్రామం నుండి ప్రతినిత్యం సుమారు 200 మందికి పైగా విద్యార్థులు ఎరిగేరి హైస్కూల్‌కు వెళ్లి వస్తుంటారని తెలిపారు. అయితే, ఈ రూట్లో వెళ్లే ఉరుకుంద, కౌతాళం తదితర బస్సులు గ్రామంలో ఆపకుండా వెళ్ళిపోతుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుర్హున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన రవాణా సౌకర్యం లేక చాలామంది విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. 13వ తేదీ నుండి శ్రావణమాస ఉత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ మార్గంలో ప్రయాణికుల రద్దీ పెరుగుతుందని, ఫలితంగా విద్యార్థులు మరీంత అవస్థలు పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రవాణా శాఖ అధికారులు, ప్రభుత్వం తక్షణమే స్పందించి పాండవగల్లు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ గ్రామ నాయకులు మోహన్ రెడ్డి, మంజు, భాష, వీరాంజి, పలు ప్రజాసంఘాల నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Continue Reading

News

తుంగభద్ర డ్యామ్ కు భారీగా పెరుగుతున్న వరద నీరు

Published

on

హోస్పేట: 11.08.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 11 (మంగళవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1626.82 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 82.599 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ప్రవాహాల వివరాలు: ◆ ఇన్‌ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున 41167 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్‌ఫ్లో 39569 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ◆ అవుట్‌ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 1630 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.

గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1626.06 అడుగులుగా ఉండగా.. 80.003 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 86.894 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

Continue Reading

News

పార్థసారథి పై రైతు సంఘం నేతల ఘాటు వ్యాఖ్యలు

Published

on

కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే డా పార్థసారథి పై రైతు సంఘం నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే డా.పార్థసారథి చిల్లర రాజకీయాలు మానుకోవాలి.. వైసిపి నేతలు మూడు రోజులు దీక్ష చేసిన శిబిరాల వద్ద వెళ్ళి ఎమ్మెల్యే వివరణ చేయాలి కాని అధికార పార్టీలో ఉండి ప్రతి పక్ష పార్టీ ఆఫీస్ ను ముట్టడి చేస్తామనడం సిగ్గు చేటుఅని వెంకటేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తెలిపారు. అభివృధి మానేసే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే డా.పార్థసారథి అని  రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేష్ ఆరోపించారు.

వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
Continue Reading

Trending