కర్నూలు జిల్లా కౌతాళం మండలం గొప్పగన్ రైల్వే గేట్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని కౌతాళం మండలానికి చెందిన నర్సారెడ్డి (S/o పెట్టి రామన్న) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఆదోనికి వచ్చి తిరిగి కౌతాళం కి వెళ్తుండగా గురువారం రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యులు లారీ ఢీ ప్రమాదంలో మృతి చెందాలని ఆరోపిస్తున్నారు. కౌతాలంకి చెందిన టీడీపీ యువ నాయకుడు సురేష్ నాయుడు బాధిత కుటుంబాన్ని ఆదోని ఏరియా ఆసుపత్రిలో పరామర్శించారు.