News
చదువుకు దూరం అవుతున్న బడుగు విద్యార్థినిలు

కర్నూలు జిల్లా ఆదోనిలో విద్యార్థినిలు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడింది హాస్టల్ వసతి లేకపోవడం వల్ల గ్రామీణ విద్యార్థులు ఉన్నత చదువులు చదవలేక మధ్యలోనే మానేసి బాల కార్మికులుగా మిగిలిపోతున్నారు. తరగతులు ప్రారంభమై 20 రోజులు గడిచిన హాస్టల్ వసతి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. చేసేదేమీ లేక చదువులు మధ్యలోనే ఆపేసే పరిస్థితి ఉందని బీసీ విద్యార్థినుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. నియోజకవర్గంలో చాలా గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల ప్రతి రోజు ఆటో చార్జీలు చెల్లించుకోలేక స్కూళ్లకు డుమ్మ కొడుతున్న పరిస్థితి ఉంది.

అలాంటి పరిస్థితి రానివ్వకుండా ప్రతి విద్యార్థినికి హాస్టల్ వసతి కల్పిస్తామని ఎమ్మెల్యే పార్థసారథి గత నెల 22న మాటిచ్చారు ఆయన మాటలు నమ్మి నియోజకవర్గంలోని ఆయా గ్రామాల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్లో ఉన్నత విద్య అభ్యాసన కోసం చేర్పించారు.

నెరవేరని ఎమ్మెల్యే హామీ: డివిజన్ కేంద్రమైన ఆదోనిలో అద్దె భవనంలోనైనా బీసీ హాస్టల్ కొనసాగేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పార్థసారథి గత నెల 22న పత్రికాముఖంగా హామీ ఇచ్చారు. హరులైన విద్యార్థినిల నుండి హాస్టల్ వసతి కోసం దరఖాస్తులు స్వీకరించాలని సోషల్ వెల్ఫేర్ అధికారులకు ఆదేశించారు. ఆ సూచన మేరకు ఆదోని పట్టణంలోనే ప్రభుత్వ గర్ల్స్ హై స్కూల్ ప్రాంగణంలో ఉన్న ఎస్సీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ అధికారులకు తల్లిదండ్రులు దరఖాస్తుల సమర్పించారు. ఇప్పటివరకు సుమారుగా 160 మంది విద్యార్థినిలు దరఖాస్తులు చేసుకున్నారు. తరగతులు గత నెల 13న ప్రారంభమయ్యాయి, ఇప్పటివరకు హాస్టల్ సదుపాయం లేకపోవడంతో సుదూర ప్రాంతాల నుండి రోజు చదువుకోడానికి ఆదోనికి వచ్చేందుకు నాన ప్రయాసలు పడాల్సి వస్తుందని విద్యార్థులు చెబుతున్నారు దరఖాస్తు చేసుకున్న వారందరికీ సదుపాయం కల్పించాలని కోరుతున్నారు. దరఖాస్తు చేసుకున్న వారందరూ రోజు ఇంటిగ్రేటెడ్ హాస్టల్ చుట్టూ తిరుగుతున్న అక్కడ ఉద్యోగుల నుండి సరైన సమాధానం రాకపోవడంతో నిరుత్సాహానికి లోనవుతున్నారు. ఇచ్చిన హామీ మేరకు ఆరో తరగతి నుండి పదవ తరగతి చదివే బిసి విద్యార్థినులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఆ దిశగా ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


విద్యార్థులందరికీ వసతి కల్పించాలి: శ్రీనివాసులు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఆదోని
డివిజన్ కేంద్రమైన ఆదోనిలో చదువుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి నుండి పదవ తరగతి చదువే గ్రామీణ విద్యార్థులకు తప్పనిసరిగా హాస్టల్ వసతి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది బీసీ హాస్టల్ నిర్వాణకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఎంతో హర్షించారన్నారు. ఎమ్మెల్యే హామీ ఇచ్చి రోజులు గడిచిన ఎలాంటి చర్యలు కనపడలేదు దరఖాస్తు చేసుకున్న వారందరూ హాస్టల్ సీటు కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి దరఖాస్తు చేసుకున్న బిసి బాలిక విద్యార్థులందరికీ హాస్టల్ వసతి కల్పించాలని లేనియెడల ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

News
శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్

కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.


News
16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.


News
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.


-
News2 weeks ago
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా
-
News3 weeks ago
భారీ వర్షనికి రామజల చెరువు నిండి ఇళ్లలోకి నీరు
-
News3 weeks ago
తుంగభద్ర డ్యాంకు పెరుగుతున్న వరద నీరు 27-09-2025
-
News3 weeks ago
ఆదోని డివిజన్లో కురిసిన వర్షపాతం
-
Business4 weeks ago
రోజు రోజుకు పతనమవుతున్న పత్తి ధర..
-
Business4 weeks ago
Gold, Silver Price బంగారు ధర
-
Business4 weeks ago
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు
-
Business4 weeks ago
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు