Connect with us

News

చదువుకు దూరం అవుతున్న బడుగు విద్యార్థినిలు

Published

on

కర్నూలు జిల్లా ఆదోనిలో విద్యార్థినిలు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడింది హాస్టల్ వసతి లేకపోవడం వల్ల గ్రామీణ విద్యార్థులు ఉన్నత చదువులు చదవలేక మధ్యలోనే మానేసి బాల కార్మికులుగా మిగిలిపోతున్నారు. తరగతులు ప్రారంభమై 20 రోజులు గడిచిన హాస్టల్ వసతి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. చేసేదేమీ లేక చదువులు మధ్యలోనే ఆపేసే పరిస్థితి ఉందని బీసీ విద్యార్థినుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. నియోజకవర్గంలో చాలా గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల ప్రతి రోజు ఆటో చార్జీలు చెల్లించుకోలేక స్కూళ్లకు డుమ్మ కొడుతున్న పరిస్థితి ఉంది.

సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థినిల తల్లిదండ్రులు

అలాంటి పరిస్థితి రానివ్వకుండా ప్రతి విద్యార్థినికి హాస్టల్ వసతి కల్పిస్తామని ఎమ్మెల్యే పార్థసారథి గత నెల 22న మాటిచ్చారు ఆయన మాటలు నమ్మి నియోజకవర్గంలోని ఆయా గ్రామాల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్లో ఉన్నత విద్య అభ్యాసన కోసం చేర్పించారు.

ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి

నెరవేరని ఎమ్మెల్యే హామీ: డివిజన్ కేంద్రమైన ఆదోనిలో అద్దె భవనంలోనైనా బీసీ హాస్టల్ కొనసాగేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పార్థసారథి గత నెల 22న పత్రికాముఖంగా హామీ ఇచ్చారు. హరులైన విద్యార్థినిల నుండి హాస్టల్ వసతి కోసం దరఖాస్తులు స్వీకరించాలని సోషల్ వెల్ఫేర్ అధికారులకు ఆదేశించారు. ఆ సూచన మేరకు ఆదోని పట్టణంలోనే ప్రభుత్వ గర్ల్స్ హై స్కూల్ ప్రాంగణంలో ఉన్న ఎస్సీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ అధికారులకు తల్లిదండ్రులు దరఖాస్తుల సమర్పించారు. ఇప్పటివరకు సుమారుగా 160 మంది విద్యార్థినిలు దరఖాస్తులు చేసుకున్నారు. తరగతులు గత నెల 13న ప్రారంభమయ్యాయి, ఇప్పటివరకు హాస్టల్ సదుపాయం లేకపోవడంతో సుదూర ప్రాంతాల నుండి రోజు చదువుకోడానికి ఆదోనికి వచ్చేందుకు నాన ప్రయాసలు పడాల్సి వస్తుందని విద్యార్థులు చెబుతున్నారు దరఖాస్తు చేసుకున్న వారందరికీ సదుపాయం కల్పించాలని కోరుతున్నారు. దరఖాస్తు చేసుకున్న వారందరూ రోజు ఇంటిగ్రేటెడ్ హాస్టల్ చుట్టూ తిరుగుతున్న అక్కడ ఉద్యోగుల నుండి సరైన సమాధానం రాకపోవడంతో నిరుత్సాహానికి లోనవుతున్నారు. ఇచ్చిన హామీ మేరకు ఆరో తరగతి నుండి పదవ తరగతి చదివే బిసి విద్యార్థినులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఆ దిశగా ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తున్న తల్లిదండ్రులు
శ్రీనివాసులు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు

విద్యార్థులందరికీ వసతి కల్పించాలి: శ్రీనివాసులు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఆదోని
డివిజన్ కేంద్రమైన ఆదోనిలో చదువుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి నుండి పదవ తరగతి చదువే గ్రామీణ విద్యార్థులకు తప్పనిసరిగా హాస్టల్ వసతి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది బీసీ హాస్టల్ నిర్వాణకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఎంతో హర్షించారన్నారు. ఎమ్మెల్యే హామీ ఇచ్చి రోజులు గడిచిన ఎలాంటి చర్యలు కనపడలేదు దరఖాస్తు చేసుకున్న వారందరూ హాస్టల్ సీటు కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి దరఖాస్తు చేసుకున్న బిసి బాలిక విద్యార్థులందరికీ హాస్టల్ వసతి కల్పించాలని లేనియెడల ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థినిల తల్లిదండ్రులు
యూట్యూబ్ వీడియో

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

సహకార ఉద్యోగుల సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘం బాసట

Published

on

ఆదోని, ఫిబ్రవరి 21:ఆదోనిలోని డి.సి.సి.బి (DCCB) బ్యాంక్ ఎదుట తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సహకార సంఘాల ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం శనివారం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సమ్మె శిబిరాన్ని సందర్శించిన సంఘం నాయకులు ఉద్యోగుల పోరాటానికి సంఘీభావం తెలిపారు.

సభలో మాట్లాడుతున్న వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు లింగన్న

ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె. లింగన్న, మండల కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు:

  • వ్యవసాయానికి వెన్నెముక: గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి సాగు పెట్టుబడి నుంచి ఇతర సేవల వరకు ప్రాథమిక సహకార సంఘాలు ఎంతో మేలు చేస్తున్నాయని వారు కొనియాడారు.
  • ప్రభుత్వ బాధ్యత: సహకార వ్యవస్థను నిర్వీర్యం చేయకుండా, వాటిని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు గుర్తు చేశారు.
  • తక్షణ పరిష్కారం: గత కొంతకాలంగా తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు శాంతియుతంగా పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. వారి న్యాయమైన కోర్కెలను వెంటనే ప్రభుత్వం ఆమోదించాలని డిమాండ్ చేశారు.
సభలో మాట్లాడుతున్న వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు లింగన్న

ఈ కార్యక్రమంలో సహకార సంఘాల ఉద్యోగులు, కార్మిక సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

News

పోగొట్టుకున్న బ్యాగ్ను పోలీసులు ఒకే ఒక్క గంటలో రికవరీ

Published

on

ఆదోని, ఫిబ్రవరి 18:

ప్రయాణంలో అజాగ్రత్తగా వదిలేసిన లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఆదోని వన్ టౌన్ పోలీసులు కేవలం ఒకే ఒక్క గంటలో రికవరీ చేసి బాధితురాలికి అప్పగించారు. పోలీసుల వేగవంతమైన స్పందనపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

అసలేం జరిగిందంటే?  కౌతాలం నుంచి ఆదోనికి ఆర్టీసీ బస్సులో వచ్చిన ఓ మహిళ, విశాల్ మార్ట్ వద్ద దిగుతూ తన బ్యాగును బస్సులోనే మరిచిపోయింది. ఆ బ్యాగులో 6 లక్షల రూపాయల విలువైన 4 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. అయితే, ఆ తొందరలో తన వెంట తెచ్చుకున్న బ్యాగును బస్సులోనే మరిచిపోయారు. కొద్దిసేపటి తర్వాత బ్యాగు గుర్తుకు రావడంతో హుటాహుటిన బస్టాండ్‌కు చేరుకుని డ్రైవర్‌ను సంప్రదించారు. బస్సులో వెతికినప్పటికీ బ్యాగు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన బాధితురాలు సాయంత్రం 3:30 గంటలకు ఆదోని వన్ టౌన్ సీఐ పి. చంద్రశేఖర్ గారికి ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు.. బాధితురాలి ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన పోలీసులు బస్సు డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు విచారణ చేపట్టారు. పలు ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గాలింపు చేపట్టారు. సాయంత్రం 4:30 గంటలకు పోగొట్టుకున్న సొత్తును తిరిగి పొందిన బాధితురాలు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

Continue Reading

News

నాటు సారా స్థావరంపై పోలీసుల దాడి

Published

on

ఆదోని రూరల్, ఫిబ్రవరి 18:

కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా ఆదోని డీఎస్పీ శ్రీ హేమలత సూచనల మేరకు, రూరల్ సీఐ నల్లప్ప పర్యవేక్షణలో బుధవారం పెద్దతుంబలం పోలీసులు భారీ దాడులు నిర్వహించారు.

ఘటన వివరాలు:

​పెద్దతుంబలం ఎస్ఐ విద్యా శ్రీ, తన సిబ్బంది రంగస్వామి (PC-3603), రామకృష్ణ (PC-3637)లతో కలిసి దొడ్డనగిరి గ్రామ శివార్లలోని సిద్ధాపురం ఆంజనేయస్వామి గుడి సమీపంలో ఉన్న గుట్టల వద్ద తనిఖీలు చేపట్టారు. అక్కడ గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న నాటు సారా బట్టిని పోలీసులు గుర్తించారు. పోలీసుల రాకను గమనించిన నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు.

భారీగా ఊట ధ్వంసం:

​పోలీసులు సారా బట్టి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అక్కడ నిల్వ ఉంచిన ఊటను తక్షణమే ధ్వంసం చేశారు. అలాగే, ప్లాస్టిక్ క్యాన్లలో నిల్వ ఉంచిన 10 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

నిందితుడి గుర్తింపు:

​పోలీసుల ప్రాథమిక విచారణలో, సారా బట్టి నిర్వహిస్తున్న వ్యక్తి ఆదోని పట్టణానికి చెందిన నాగరాజు కుమారుడు బోయ శివగా తేలింది. స్థానిక పొలాల యజమానుల నుంచి సేకరించిన సమాచారం మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విద్యా శ్రీ తెలిపారు. అక్రమ మద్యం తయారీ మరియు రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

Continue Reading

Trending