Connect with us

News

నాటు సారా తరలిస్తున్న వ్యక్తి అరెస్టు

Published

on

కర్నూలు జిల్లా ఆదోనిలో శనివారం సాయంత్రం 5 గంటలకు ఆదోని పట్టణం అమరావతి నగర్ సమీపంలో వాహన తనిఖీ చేస్తుండగా పత్తికొండ మండలం JM తాండా గ్రామంనికి చెందిన నేనావత్ లోకేష్ అనే వ్యక్తి AP 21 AW 7943 (Bajaj Discover) స్కూటర్లో 20 లీటర్ల నాటు సారాయి తరలిస్తుండగా వన్ టౌన్ సిఐ విక్రమ సింహ పట్టుకున్నారు అతని అరెస్టు చేసి 20 లీటర్ల నటసార స్కూటర్ని స్వాధీనం చేసుకొని రిమైండ్ కి తరలించినట్లు సిఐ విక్రమ సింహ తెలిపారు.
వాహన తనిఖీలో 1 టౌన్ CI విక్రమసింహ
సిబ్బంది హాజీ భాషా , రంగస్వామి, సుధీర్, మునస్వామి పాల్గొన్నారు.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ఆదోనిలో వైఎస్ఆర్సిపి భారీ నిరసన ర్యాలీ

Published

on

డీఎస్సీ లో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని  కర్నూలు జిల్లా ఆదోనిలో  మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం నుంచి శ్రీనివాస్ భవన్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ బిజెపి ఎమ్మెల్యే పై ఘాటుగా స్పందించారు హైలెట్ కావడానికి ఇలా చేస్తూ పిచ్చాసుపత్రి నుంచి పారిపోయినట్లు పరిగెత్తి వెళ్లడం ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. అభివృద్ధి అంటే గాడిద పాలు తాగడం, దోషాలు వేయడం కాదని మెడికల్ కాలేజ్ ఓపెన్ చేయాలని మైనారిటీ ఐటిఐ కాలేజ్, డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ పనులు పూర్తిచేసి సిబ్బంది తప్పిస్తే అది అభివృద్ధి అన్నారు. ఏమి చేతకాక చర్చలకు వస్తానని మాట్లాడడం సరైన పద్ధతి కాదని తెలిపారు.

ర్యాలీ నిర్వహిస్తున్న వైసిపి నాయకులు

ఈ ర్యాలీలో పట్టణ గౌరవాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి పట్టణ అధ్యక్షులు దేవా మహిళా నాయకులు మైనారిటీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మధుసూదన్
ర్యాలీ నిర్వహిస్తున్న వైయస్సార్సీపి నాయకులు కార్యకర్తలు
Continue Reading

News

తుంగభద్ర డ్యామ్ కు భారీగా పెరుగుతున్న వరద నీరు

Published

on

హోస్పేట: 10.08.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 10 (సోమవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1625.82 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 79.201 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ప్రవాహాల వివరాలు: ◆ ఇన్‌ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున 43022 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్‌ఫ్లో 42450 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ◆ అవుట్‌ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 1757 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.

గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1626.06 అడుగులుగా ఉండగా.. 80.003 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 84.456 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

Continue Reading

News

హై డ్రామా కు తెరలేపిన ఆదోని ఎమ్మెల్యే

Published

on

కర్నూలు జిల్లా ఆదోనిలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి హైడ్రామాకు తేరలైపోయారు. డీఎస్సీ నియామకాల్లో ఎటువంటి అవకతవకలు జరగలేదని అవకతవకలు జరిగి ఉంటే బహిరంగ చర్చలకు సిద్ధమా అని వైసిపి నాయకులకు ఎమ్మెల్యే పార్థసారథి సవాల్ విసిరారు. దీనికి వైసిపి నాయకులు స్వీకరించి బహిరంగ చర్చలకు సిద్ధమని తెలపడంతో ఐదు గంటలకు వస్తాను అన్న పార్థసారధి కొద్ది దూరం వచ్చి తర్వాత పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు రోడ్డుపై హైడ్రామా చేసి వెన్ను తిరిగి వెళ్ళిపోయారు.

మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఇంటి ముందుకు చేరుకున్న వైసిపి నాయకులు కార్యకర్తలు
పూర్తి వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

నిజంగా అవకతవకలు జరగలేదంటే మేము చర్చలకు ఎక్కడికైనా సిద్ధమని వైసిపి నాయకులు తేల్చి చెప్పారు. ఆదోని ఎమ్మెల్యే పై ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, వైఎస్ఆర్సిపి పట్టణ గౌరవ అధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి మండిపడ్డారు.

పోలీస్ జీప్ లో ఎక్కించే ప్రయత్నం చేస్తున్న సీఐ
ఎమ్మెల్యే తో మాట్లాడుతున్న పోలీసులు
రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యే
Continue Reading

Trending