News
తుంగభద్ర ఎల్.ఎల్.సి కాలువకు జలహారతి
కర్నూలు జిల్లా అదోనిలో తుంగభద్ర ఎల్.ఎల్.సి (లోలెవెల్ కెనాల్) కాలువకు నీళ్లు రావడంతో జలహారతి నిర్వహించి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కు నీటిని విడుదల చేశారు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్. మున్సిపల్ చైర్ పర్సన్ శాంత పూజలు నిర్వహించి పట్టుచీరను సమర్పించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పూర్తిగా నిండిపోతుందని ఇప్పటినుండి ఆదోని పట్టణ ప్రజలకు నీటి సమస్య ఉండదని అయితే కొత్తనీరు వస్తున్నందుకు కాచి వడపోసి త్రాగాలని ఎమ్మెల్యే తెలిపారు. మున్సిపల్ ఇంజనీర్ నాగభూషణం మాట్లాడుతూ 45 రోజులు నీళ్లు పంపిగ్ చేయడంతో ఎస్ఎస్ ట్యాంక్ పూర్తిగా నిండిపోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కార్పొరేషన్ డైరెక్టర్ రేణుక, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ నాగభూషణ్ రెడ్డి, అసిస్టెంట్ ఇంజనీర్ రాజశేఖర్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




