కర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్ గ్రామ సమీపంలో సోమవారం వాల్మీకి విగ్రహం వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడడంతో నలుగురికి గాయాలు అయ్యాయి. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించరు. గాయాలైన ప్రయాణికులు తెలిపిన వివరాల మేరకు జోహరాపురం గ్రామం నుంచి ఆదోనికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.