News
ఉచిత గుండె ఆపరేషన్ అందించిన మహనీయుడు వైఎస్సార్
కర్నూలు జిల్లా ఆదోని లో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు వైఎస్ఆర్సిపి నాయకులు. అనంతరం ఆదోని పట్టణ అధ్యక్షులు బి దేవా వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు చంద్రకాంత్ రెడ్డి లు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ తో విద్యార్థులకు మేలు చేయడం జరిగిందని అన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి పేద వాడికి ఉచిత గుండె ఆపరేషన్ ఇలా అనేక రకాలుగా వైద్యం పేదలకు అందిస్తూ వైద్యానికి పెద్దపీట వేస్తూ పేదలకు రూపాయికి కిలో బియ్యం అందించి అలాగే ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇల్లు కట్టించి అందించారని తెలిపారు. మహిళలకు పొదుపు గ్రూపులు ద్వారా రుణాలు అందించి అండగా నిలబడడం మరి అలాంటి మహనీయుడు ఆకస్మిక ప్రమాదంతో మృతి చెందడంతో ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 600 మంది గుండె ఆగి పోయాయని అటువంటి మహానుభావుడు చరిత్రలో మరుపురాని చిరస్మరణీయుడుగా నిలిచాడని కొనియాడారు. తనయుడుగా ఆయన ఆశయాలతో వైయస్ జగన్ వైఎస్ఆర్సిపి పార్టీ స్థాపించి తండ్రికి తగ్గ తనయుడుగా ఈ రాష్ట్ర ప్రజల కోసం నవరత్నాలు అనే సంక్షేమ పథకాలు ద్వారా ప్రతి పేదకు ప్రతి విద్యార్థికి ప్రతి కార్మికులకు ప్రతి మహిళలకు అండగా నిలిచారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అరాచక శక్తులు విలయతాండవం ఆడుతున్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సునర్ ఖాదర్, నల్లారెడ్డి, ఫయాజ్, చిన్న ఈరన్న తాయన్న రామకృష్ణ గంగాధర్ సుధాకర్ ఆర్వి బాబు శ్రీలక్ష్మి రామకృష్ణ మల్లికార్జున రమేష్ వేణు రైల్వే ఈరన్న వచ్చిరప్ప తిమ్మప్ప సోమలింగ లక్ష్మన్న రామలింగేశ్వర స్వామి దుర్గప్ప సురేష్ స్టోర్ గోపాల్ శీను మధు కుప్పయ్య తిక్కన్న గోవిందు మహమ్మద్ భాష జమీల్ గోపాల్ రెడ్డి వీరారెడ్డి సర్పంచ్ మహాదేవ సుల్తాన్పురం సర్పంచ్ వీరేష్ నారి నాగరాజు సిద్ధ లక్ష్మణ రామంజి దానం తదితరులు పాల్గొన్నారు
News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




