Connect with us

News

​ప్రమాదాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన అధికారులు

ఆదోని, ఆగస్టు 1: రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జాతీయ రహదారి–167పై…

Published

on

ఆదోని, ఆగస్టు 1: రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జాతీయ రహదారి–167పై అధికారుల బృందం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది. ఆదోని బసవేశ్వర సర్కిల్ నుండి మాధవరం క్రాస్ వరకు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను (బ్లాక్ స్పాట్లు) శనివారం ఆర్‌డీఓ శ్రీమతి కె. అరుణాదేవి నేతృత్వంలో అధికారులు పరిశీలించారు.

ఆర్డీవో మరియు ఆర్టిఓ అధికారులకు తనిఖీలు చేస్తున్న ఫోటో

​ఈ పరిశీలనలో రోడ్డు వెడల్పు, ప్రమాదకర మలుపులు, ప్రధాన కూడళ్లు, మీడియన్ ఓపెనింగ్స్, డ్రైనేజీ వ్యవస్థ, హెచ్చరిక బోర్డులు, రాత్రి వేళల్లో వెలుతురు (స్ట్రీట్ లైటింగ్) మరియు పాదచారుల భద్రతా అంశాలను అధికారులు సమగ్రంగా సమీక్షించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలి. ప్రజల ప్రాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలి కె. అరుణాదేవి, ఆర్‌డీఓ ఆదేశాలు & సూచనలు చేశారు.

ఆర్డీవో అధికారులతో కలసి తనిఖీలు చేస్తున్న ఫోటో

తక్షణ భద్రతా చర్యలు: ప్రమాదకర ప్రాంతాల్లో వెంటనే హెచ్చరిక బోర్డులు, రంబుల్ స్ట్రిప్స్, రిఫ్లెక్టివ్ క్యాట్ ఐస్, క్రాష్ బ్యారియర్లు, స్పీడ్ లిమిట్ బోర్డులు, సోలార్ బ్లింకర్లను ఏర్పాటు చేయాలి. శాశ్వత పరిష్కారాలు: సర్వీస్ రోడ్లు, బస్ బేల నిర్మాణం, వర్షపు నీటి పారుదల వ్యవస్థను మెరుగుపరచడం మరియు ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించిన శాశ్వత ప్రతిపాదనలు సిద్ధం చేసి త్వరితగతిన పూర్తి చేయాలి. ​అవగాహన కార్యక్రమాలు: ఇంజినీరింగ్ లోపాలను సరిచేయడంతో పాటు, వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి ప్రమాదాలను గణనీయంగా తగ్గించాలి.

ఆర్డీవో అధికారులతో కలసి తనిఖీలు చేస్తున్న ఫోటో

​ఈ తనిఖీ కార్యక్రమంలో ఆర్‌డీఓతో పాటు రోడ్లు & భవనాల శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ మహేశ్వర రెడ్డి, నేషనల్ హైవేస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ భాస్కర్ రెడ్డి, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (DTC) శ్రీమతి శాంతకుమారి, రెవెన్యూ, రవాణా, నేషనల్ హైవేస్, ఆర్‌అండ్‌బీ మరియు పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ఆదోని జిల్లా సాధన రిలే నిరాహార దీక్ష తాత్కాలిక విరామం

Published

on

కర్నూలు జిల్లా అదోనిలో గత 269 రోజులుగా ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్‌తో ఆదోని జిల్లా సాధన సమితి జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు తాత్కాలికంగా విరామం లభించింది. ఆదోని మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కే. మీనాక్షి నాయుడు విజ్ఞప్తి మేరకు జేఏసీ నాయకులు దీక్షా శిబిరాన్ని విరమించి వేదికను తొలగించారు.

దీక్ష శిబిరాన్ని తొలగిస్తున్న ఫోటో

దీక్ష విరమణ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మాట్లాడుతూ — రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, సాంకేతిక అంశాల దృష్ట్యా తక్షణమే కొత్త జిల్లాల ఏర్పాటు సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. కేంద్రం చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లు ఆమోదం పొందిన వెంటనే, కొత్త నియోజకవర్గాలు మరియు జిల్లాల సంఖ్య పెరుగుతుందని ఆ సమయంలో ఆదోనిని జిల్లాగా ప్రకటించే అంశాన్ని ఖచ్చితంగా పరిశీలిస్తామని లోకేష్ మరియు ఇన్‌చార్జ్ మంత్రి హామీ ఇచ్చారని మీనాక్షి నాయుడు వెల్లడించారు.

దీక్ష శిబిరం వద్ద మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు

జేఏసీ ప్రతినిధులు వై.పి. నాగరాజ్, సుజ్ఞానమ్మ, దేవశెట్టి ప్రకాష్ తదితరులు మాట్లాడుతూ — గత 269 రోజులుగా పశ్చిమ కర్నూలు ప్రాంత ప్రజల కాంక్ష మేరకు సాగిన ఈ ఉద్యమానికి ఆదోనితో పాటు ఆలూరు, మంత్రాలయం, పత్తికొండ, ఎమ్మిగనూరు నియోజకవర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని జేఏసీ నాయకులు గుర్తుచేశారు. కుల, మత, రాజకీయ పార్టీల అతీతంగా వ్యాపారులు, విద్యార్థులు, రైతులు, కార్మికులు, పత్రికా ప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాలు ఈ దీక్షలకు పూర్తి మద్దతు తెలిపారుఅని ఇది ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా చేసిన ఉద్యమం కాదని 77 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన పశ్చిమ ప్రాంత సమగ్ర అభివృద్ధి, మెరుగైన వైద్యం, తాగు/సాగు నీటి లభ్యత కోసమే ఈ పోరాటం ప్రారంభించామని తెలిపారు. ఈ సందర్భంగా 269 రోజుల పాటు ఉద్యమానికి సహకరించిన ప్రజలకు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మరియు సోషల్ మీడియా ప్రతినిధులకు జేఏసీ నేతలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు

దీక్ష శిబిరాన్ని తొలగిస్తున్న జేఏసీ నాయకులు
Continue Reading

News

DYFI ఆధ్వర్యంలో పాండవగల్లు బస్టాండ్ వద్ద రాస్తారోకో

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్లు గ్రామం నుండి ఎరిగేరి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల కోసం తక్షణమే ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాలని డివైఎఫ్ఐ (DYFI) డిమాండ్ చేస్తూ మంగళవారం పాండవగల్లు బస్టాండ్ ప్రధాన రహదారిపై విద్యార్థులు, నాయకులతో కలసి రాస్తారోకో నిర్వహించారు.

రాస్తారోకోతో నిలుబడిపోయిన వాహనాలు
వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

ఈ సందర్భంగా డివైఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు చిరంజీవి మాట్లాడుతూ… పాండవగల్లు గ్రామం నుండి ప్రతినిత్యం సుమారు 200 మందికి పైగా విద్యార్థులు ఎరిగేరి హైస్కూల్‌కు వెళ్లి వస్తుంటారని తెలిపారు. అయితే, ఈ రూట్లో వెళ్లే ఉరుకుంద, కౌతాళం తదితర బస్సులు గ్రామంలో ఆపకుండా వెళ్ళిపోతుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుర్హున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన రవాణా సౌకర్యం లేక చాలామంది విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. 13వ తేదీ నుండి శ్రావణమాస ఉత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ మార్గంలో ప్రయాణికుల రద్దీ పెరుగుతుందని, ఫలితంగా విద్యార్థులు మరీంత అవస్థలు పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రవాణా శాఖ అధికారులు, ప్రభుత్వం తక్షణమే స్పందించి పాండవగల్లు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ గ్రామ నాయకులు మోహన్ రెడ్డి, మంజు, భాష, వీరాంజి, పలు ప్రజాసంఘాల నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Continue Reading

News

తుంగభద్ర డ్యామ్ కు భారీగా పెరుగుతున్న వరద నీరు

Published

on

హోస్పేట: 11.08.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 11 (మంగళవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1626.82 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 82.599 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ప్రవాహాల వివరాలు: ◆ ఇన్‌ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున 41167 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్‌ఫ్లో 39569 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ◆ అవుట్‌ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 1630 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.

గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1626.06 అడుగులుగా ఉండగా.. 80.003 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 86.894 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

Continue Reading

Trending