News
తాళాలు పగలగొట్టి ఇంట్లో చోరీ
కర్నూలు జిల్లా ఆదోని ఆర్టీసీ కాలనీ సమీపంలోని లక్ష్మీ ఎస్టేట్ లో తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న సుమారు 1,72,000 నగదు, 3 తులాల బంగారు దొంగలు ఎత్తుకెళ్లినట్లు బాధ్యతలు టీచర్ విరచంద్ర యాదవ్ తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నరు.
బాధితుడు టీచర్ చంద్ర తెలిపిన వివరాల మేరకు భార్య శ్వేత టీచర్ కావడంతో ఇద్దరు సెలవు పెట్టి భార్య శ్వేత తండ్రి అనరోగ్యంతో ఉండడంతో చూడడానికి ఆదివారం ఊరికి వెళ్లి బుధవారం సాయంత్రం ఇంటికి వచ్చి చూస్తే ఇంటి తాళాలు పగలగొట్టి మొత్తం చిందరమందరంగా పడి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఊరికి వెళ్లేటప్పుడు బంగారు ని లాకర్లు పెట్టి వెళ్లడంతో మిగిలిపోయామని ఊపిరి పీల్చుకున్నారు. అమ్మ చీటీ ఎత్తిన డబ్బులు 1,40,000, భార్య దాచుకున్న 20000, పిల్లలు దాచుకున్న హుండీలో 12000 డబ్బులు సుమారు మూడు తులాలు ఉన్న బంగారు కమ్మలు ఎత్తుకెళ్లారని బాధితులు తెలిపారు.


News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




