News
విద్యార్థుల ఆట స్థలాలను కాపాడండి DSF, NSUI

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం దొడ్డనగేరి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల లో ఆట స్థలంలో పశువుల హాస్పిటల్ భవనం నిర్మాణ పనులు నిలిపివేయాలని కోరుతూ DSF, NSUI ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు శనివారం వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా DSF జిల్లా అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, NSUI ఎన్ ఎస్ యు ఐ జిల్లా కార్యదర్శి బాలు మాట్లాడుతూ ఆదోని మండలం దొడ్డనగేరి గ్రామంలో విద్యార్థుల ఆటస్థలం ( గ్రౌండ్)లో నుంచి పొలాలకు, ఇండ్లకు వెళ్లే రోడ్డు గా మార్చేశారని అంతటితో ఆగకుండా ఆట స్థలంలో వాటర్ ట్యాంక్, షాపుల కోసం చాలా స్థలము ఆక్రమించారని విద్యార్థి సంఘం బిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పశువుల హాస్పిటల్ కోసం భవన నిర్మాణం చేపడుతున్నారని ఇలా కట్టుకుంటూ వెళ్తే విద్యార్థులకు ఆట స్థలం ఎక్కడ మిగులుతుందని భవిష్యత్తులో భావితరాల విద్యార్థులకు ఆట స్థలం మిగలదని విద్యార్థి సంఘం నాయకులు ఎన్ ఎస్ యు ఐ జిల్లా కార్యదర్శి బాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాఠశాలలో దాదాపుగా 1100 మంది విద్యార్థులు చదువుతున్నరని జూన్ 12 నాటికి పాఠశాలలు ఓపెన్ అయితే విద్యార్థులు ఎక్కడ ఆడుకోవాలని ప్రశ్నించారు. విద్యార్థుల ఆట స్థలాన్ని కాపాడాలని కోరుతూ సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేసినట్లు విద్యార్థి సంఘం నాయకులు తెలిపారు.
News
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 03 06 25:
రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 16/- రూపాయలు, రిటైల్: 1kg 18/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయలు


News
రైతులకు రాయితీ వేరుశనగ పంపిణీ

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ అధికారి అశోక్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆదోని మండలం లోని గ్రామాల రైతు సోదరులకు ప్రభుత్వ రాయితీ ద్వారా వేరుశనగ పంపిణీ చేస్తుందని రైతు సేవ కేంద్రాలలో రాయితీ వేరుశనగ కోసం రైతులు తమ ఆధార్ కార్డులతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. వేరు శనగ విత్తనాలు (K 6) రకం కావాల్సిన రైతులు రిజిస్ట్రేషన్ చేసుకొని విత్తనాలు పొందవచ్చని ఒక రైతుకు ఎకరాల ప్రకారం (0.5 ఎకరాలకు 1 బ్యాగు, 2 ఎకరాలకు 03బ్యాగులు) గరిష్టంగా 3 బ్యాగుల వరకు ఇస్తున్నట్లు తెలిపారు, ఒక బ్యాగు బరువు 30 కేజీలు. ఉంటుందని వేరు శనగ క్వింటాలు ధర 9300/- కు, ప్రభుత్వ రాయితీ 3720/- రైతు వాటా 5580/- కట్టాలని అన్నారు.


News
ఎరువుల అక్రమ రవాణా పై ఉక్కు పాదం

కర్నూలు జిల్లా ఆదోనిలో సిరుగుప్ప టర్నింగ్ వద్ద వ్యవసాయ రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. వ్యవసాయ అధికారి అశోక్ కుమార్ తెలిపిన వివరాల ఎలా ఉన్నాయి ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా ఎరువుల రవాణా చేస్తున్నారని సమాచారంతో సోమవారం అక్రమ రవాణాను అరికట్టుడాం కోసం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వ్యవసాయ అధికారి పి. ఎల్. వరలక్ష్మి ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ, రవాణా మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బృందాలను బృందాలుగా ఏర్పడి శిరుగుప్ప చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించామని తెలిపారు. ఈ తనిఖీలో వ్యవసాయ శాఖ వ్యవసాయ సహాయ సంచాలకులు బి.బాలవర్ధి రాజు, వ్యవసాయ అధికారి సి. అశోక్ కుమార్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్, ఆర్ ఐ పెద్దయ్య పాల్గొన్నారు.


-
News4 days ago
కౌతాళం మండలం లో దారుణం
-
News3 days ago
క్రికెట్ బెట్టింగ్ లో 91 లక్షల నగదు స్వాధీనం
-
News3 weeks ago
భారత్-పాక్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన
-
News2 weeks ago
ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్గా లోకేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నిక
-
News12 hours ago
ఎరువుల అక్రమ రవాణా పై ఉక్కు పాదం
-
News13 hours ago
ఫిట్నెస్ లేని స్కూల్ బస్సుల యాజమాన్యం పై చర్యలు తీసుకోండి
-
News3 weeks ago
వీరజవాన్ మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించిన మంత్రి నారా లోకేష్
-
News2 days ago
వెన్నుపోటు దినం పోస్టర్ విడుదల చేసిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి