Connect with us

News

వెన్నుపోటు దినం పోస్టర్ విడుదల చేసిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో వెన్నుపోటు దినం పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. మరియు పార్టీ నాయకులు పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నాల్గవ తేదీ కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, రైతులు, యువత నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ప్రజలు చంద్రబాబుకు పాలన ఇచ్చింది తమకు మేలు జరుగుతుందని ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని గెలిపిస్తే ఈ ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రెడ్ బుక్ పాలన చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు చేయకుండా ముఖ్య నాయకుల పై సోషల్ మీడియా పై కేసులు పెడుతూ పరిపాలన సాగిస్తున్నారని అందువల్ల ఇప్పటినుంచి పోరాటాలు చేయకపోతే చాలా అరాచకాలు జరుగుతాయని తెలిపారు. ఈ ప్రభుత్వం అమరావతికి మాత్రమే అభివృద్ధికి కృషి చేస్తుంది కానీ గత వైసిపి ప్రభుత్వం లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర మొత్తం అభివృద్ధి చెందాలని ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని కొనియాడారు. ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా నాలుగో తేదీ పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.

పోస్టర్ విడుదల చేస్తున్న నాయకులు
విలేకరుల తో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి
పూర్తి వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

Published

on

By

ఆదోని 03 06 25:

రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 16/- రూపాయలు, రిటైల్: 1kg 18/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయలు

03 06 25 రైతు బజార్ ధరల పట్టిక
Advertisement
Continue Reading

News

రైతులకు రాయితీ వేరుశనగ పంపిణీ

Published

on

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ అధికారి అశోక్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆదోని మండలం లోని గ్రామాల రైతు సోదరులకు ప్రభుత్వ రాయితీ ద్వారా వేరుశనగ పంపిణీ చేస్తుందని రైతు సేవ కేంద్రాలలో రాయితీ వేరుశనగ కోసం రైతులు తమ ఆధార్ కార్డులతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. వేరు శనగ విత్తనాలు (K 6) రకం కావాల్సిన రైతులు రిజిస్ట్రేషన్ చేసుకొని విత్తనాలు పొందవచ్చని ఒక రైతుకు ఎకరాల ప్రకారం (0.5 ఎకరాలకు 1 బ్యాగు, 2 ఎకరాలకు 03బ్యాగులు) గరిష్టంగా 3 బ్యాగుల వరకు ఇస్తున్నట్లు తెలిపారు, ఒక బ్యాగు బరువు 30 కేజీలు. ఉంటుందని వేరు శనగ క్వింటాలు ధర 9300/- కు, ప్రభుత్వ రాయితీ  3720/- రైతు వాటా 5580/- కట్టాలని అన్నారు.

రాయితీ వేరుశనగ అందిస్తున్న ఫోటో
రాయితీ వేరుశనగ
Continue Reading

News

ఎరువుల అక్రమ రవాణా పై ఉక్కు పాదం

Published

on

కర్నూలు జిల్లా ఆదోనిలో సిరుగుప్ప టర్నింగ్ వద్ద వ్యవసాయ రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. వ్యవసాయ అధికారి అశోక్ కుమార్ తెలిపిన వివరాల ఎలా ఉన్నాయి ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా ఎరువుల రవాణా చేస్తున్నారని సమాచారంతో సోమవారం అక్రమ రవాణాను అరికట్టుడాం కోసం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వ్యవసాయ అధికారి పి. ఎల్. వరలక్ష్మి ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ, రవాణా  మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బృందాలను బృందాలుగా ఏర్పడి శిరుగుప్ప చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించామని తెలిపారు. ఈ తనిఖీలో వ్యవసాయ శాఖ  వ్యవసాయ సహాయ సంచాలకులు బి.బాలవర్ధి రాజు, వ్యవసాయ అధికారి సి. అశోక్ కుమార్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్, ఆర్ ఐ పెద్దయ్య  పాల్గొన్నారు.

తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు
తనిఖీలు నిర్వహిస్తున్న వ్యవసాధికారి
Continue Reading
News4 days ago

కౌతాళం మండలం లో దారుణం

News3 days ago

క్రికెట్ బెట్టింగ్ లో 91 లక్షల నగదు స్వాధీనం

News3 weeks ago

భారత్‌-పాక్‌ యుద్ధంపై ట్రంప్‌ సంచలన ప్రకటన

News2 weeks ago

ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్‌గా లోకేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నిక

News12 hours ago

ఎరువుల అక్రమ రవాణా పై ఉక్కు పాదం

News13 hours ago

ఫిట్నెస్ లేని స్కూల్ బస్సుల యాజమాన్యం పై చర్యలు తీసుకోండి

News3 weeks ago

వీరజవాన్ మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించిన మంత్రి నారా లోకేష్

News2 days ago

వెన్నుపోటు దినం పోస్టర్ విడుదల చేసిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి

News3 weeks ago

శాశ్వతంగా త్రాగునీటి పరిష్కరించాలని  సిపిఎం పార్టీ పాదయాత్ర

News3 weeks ago

ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం నిర్మించాలని DSF,PDSO డిమాండ్

Trending