Author: Public Judgement

ఆదోనిలో స్వతంత్ర అభ్యర్థులు ముగ్గురు..

కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం లో ఆదోని అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఆదోని -146 రిటర్నింగ్ అధికారి/సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మకు నామినేషన్ పత్రాలు అందచేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రమేష్ యాదవ్ అందజేశారు. మరియు రిటర్నింగ్ అధికారి/సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మకు స్వతంత్ర అభ్యర్థులు కె. రంగన్న, కె. భాగ్య లక్ష్మి, ఉరుకుందు వడ్డే నామినేషన్ పత్రాలను అందజేశారు. ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం లో రిటర్నింగ్ అధికారి/సబ్ కలెక్టర్ […]

రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య

కర్నూలు జిల్లా అదోని మండలం నగరూర్ – ఆస్పరి మధ్య రైల్వే ట్రాక్ ఆస్పరి గ్రామానికి చెందిన కోటి సతీష్ (25) అను వ్యక్తి గుర్తు తెలియని రైలు/ గూడ్స్ కింద ఆత్మహత్య చేసుకొని తీవ్రమైన రక్త గాయాలతో చనిపోయినాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారని రైల్వే ఎస్సై కే గోపాల్ తెలిపారు.

అభివృద్ధి జగన్ తోనే సాధ్యం ఆరెకల్ రమేష్

కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆరెకల్ గ్రామానికి చెందిన రమేష్ మరియు వారి కుటుంబ సభ్యులు ఫ్రాన్సిస్, జై రాజు, ఆనందు, చంద్ర ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మరియు రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి వైఎస్ఆర్ పార్టీలో చేరుతున్నట్లు రమేష్ తెలిపారు.

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

కర్నూలు జిల్లా ఆదోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాటా ఐపిఎల్ 2024 బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిని అరెస్ట్ చెసి వారి వద్ద నుండి సుమారు 2 లక్షల 50 వేలు నగదు 4 సెల్ ఫోన్ స్వాధీనం తీసుకున్నారు 3 టౌన్ పోలీసులు. ముద్దాయిలను డి.ఎస్.పి శివ నారాయణ స్వామి ముందు హాజరు పరిచి రిమాండ్ కి తరలించారు త్రీ టౌన్ సిఐ నరసింహారాజు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కర్నూలు జిల్లా SP […]

సాయి నామినేషన్కు తరలివచ్చిన జన ప్రభంజనం..

కర్నూలు జిల్లా ఆదోనిలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి వై. సాయి ప్రసాద్ రెడ్డి భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా నామినేషన్ కు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నామినేషన్ వేసిన అనంతరం వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తుకు రెండు ఓటేసి గెలిపించాలని ప్రజలను […]

దళిత సంఘాల నేతలతో పాటు, పలు స్వచ్ఛంద సంఘ ల ఘన నివాళి

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కర్నూలు జిల్లా పత్తికొండలో దళిత సంఘాల నేతలతో పాటు, పలు స్వచ్ఛంద సంఘ ప్రతినిధులు ఘన నివాళి అర్పించారు. దళిత సమాఖ్య నాయకులు శీను, మోజెస్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు డప్పు వాయిద్యాలతో ర్యాలీ నిర్వహించారు. అలాగే సిపిఐ అనుబంధ సంస్థ దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ నుండి అంబేద్కర్ […]

కులమతాలకు అతీతంగా అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కులమతాలకు అతీతంగా అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం హక్కులు కల్పించిన మహోన్నత రాజనీతిజ్ఞుడు అని ఎమ్మార్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల రమేష్ అన్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా పత్తికొండలో రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహం నుండి తేరు బజార్, గుత్తి సర్కిల్, నాలుగు స్తంభాల కూడలి మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు ఎమ్మార్పీఎస్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ […]

మేమంతా సిద్ధం బస్సుయాత్రలో సీఎం జగన్ పై దాడి

సిఎం జగన్‌పై రాళ్ల దాడి జరిగింది.బస్సుయాత్రలో భాగంగా సింగ్‌నగర్‌కు చేరుకున్న క్రమంలో సీఎం జగన్‌పై రాయితో దాడి చేశారు. బస్సుపై నుంచి సీఎం జగన్‌ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో రాయితో దాడి జరిగింది.అయితే ఆ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్‌ కనుబొమ్మకు తాకింది. సీఎం జగన్‌పై క్యాట్‌ బాల్‌తో దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాయి తగలడంతో సీఎం జగన్‌ ఎడమ కంటికి కనుబొమ్మపై గాయమైంది, సీఎం జగన్‌ పక్కనే ఉన్న ఎమ్మెల్యే […]

37 లక్షల నగదు స్వాధీనం

కర్నూలు జిల్లా ఆదోని రైల్వే స్టేషన్ సమీపంలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు మరియు టూ టౌన్ పోలీసులు ఎన్నికలలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తుండ మల్లికార్జున అనే వ్యక్తి నుండి 37 లక్షలు నగదు స్వాధీనం చేసుకొన్నారు.డి.ఎస్.పి శివ నారాయణ స్వామి తెలిపిన వివరాల మేరకు రాబడిన సమాచారంతో అనుమానాస్పదంగా తిరుగుతున్న మల్లికార్జున అనే వ్యక్తిని తనిఖీ చేయగా అతని వద్ద ఉన్న 37 లక్షలకు ఎలాంటి ఆధారాలు మరియు రసీదులు చూపకపోవడంతో నగదును స్వాధీనం చేసుకుని ఇన్కమ్ […]

సలకలకొండ గ్రామంలో చిరుత మృతి

కర్నూలు జిల్లా ఆదోని మండలం , సలకలకొండ గ్రామం లో చిరుత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో ఆదోని అడవి అటవీశాఖ FRO తేజస్విని ఘటనా స్థలాన్ని చేరుకునీ చిరుత మృత దేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆదోని తరలించారు. పొలం యజమాని ఉరుకుంద రెడ్డి చెప్పిన వివరాల మేరకు అలసందగుత్తి గ్రామంలో పొలం పనులకు వెళ్తున్న గ్రామస్తులు ఉరుకుంద రెడ్డి పొలంలో చిరుత పులిని చూసి పరుగులు తీశారని , అయితే […]

Back To Top
Exit mobile version