Author: Public Judgement

ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు ఇక లేరు

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు(88) కన్నుమూశారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలెటర్పై చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థీవదేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించారు.విలువలతో కూడిన జర్నలిజానికి పర్యాయ పదంగా, అంచెలంచెలుగా ఎదిగిన మీ ప్రస్థానం మరువలేనిది! జీవితాంతం ప్రజల పక్షాన అక్షరాన్ని నిలిపి..ప్రజా పరిరక్షనకు పాటుపడిన […]

ఆదోని అభివృద్ధికి సహకరించండి

కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గురువారం తెలుగుదేశం పార్టీ అధినేత కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాడేపల్లిగూడెం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. అధినేత చంద్రబాబు నాయుడుకి శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆదోని అభివృద్ధికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

ఇండియా కూటమి బాబుకు బంపర్ ఆఫర్

కేంద్రంలో బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సరిపడ సీట్లు రాకపోవడంతో ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలోనే బిహార్‌లోని జేడీయూ అధినేత నితీష్ కుమార్, ఆంధ్రాలోని చంద్రబాబు మద్దతు ఎన్డీయేకు అనివార్యమైంది. ఈ క్రమంలోని ఇండియా కూటమి కూడా కేంద్రంలో ప్రభత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతోంది. ఈ మేరకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు తాయిలాలను చూపుతోంది. కాగా చంద్రబాబు నాయుడుకు డిప్యూటీ ప్రైమ్‌ మినిస్టర్‌ పదవి ఇస్తామంటూ […]

ఆదోనికి ఎమ్మెల్యే ఎవరు

ఆదోనికి ఎమ్మెల్యేగా ఎవరు..రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తుంది..తమ అభిప్రాయాన్ని తెలిపిన ప్రజలు..ఇది నిజమవుతుందా? పబ్లిక్ జడ్జిమెంట్ న్యూస్ ఛానల్ చేసిన సర్వే పబ్లిక్ జడ్జిమెంట్ న్యూస్ ఛానల్ చేసిన సర్వేలో ఆదోని ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారని ప్రజల్ని వాట్సాప్ లో ఓటింగ్ నిర్వహిస్తే వైసీపీ అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి విజయం సాధిస్తారని 59.76% ఓటు వేశారు. టిడిపి కూటమి బిజెపి అభ్యర్థి పార్థసారథి కి 40.24% ఓటు వేసి తెలిపారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ […]

అదోనిలో భారీగా వాహనాలు సీజ్

కర్నూలు జిల్లా ఆదోని లో విజయనగర్ కాలనీ, కౌడల్ పేట, వాల్మీకి నగర్, బోయగిరి ఏరియాలలో రెండు రోజులుగా కార్డెన్ అండ్ సెర్చ్ ను నిర్వహించిన పోలీసులు. అందులో భాగంగా ఎటువంటి రికార్డ్స్ లేని 1 కారు, 6 ఆటోలు, 2 బొలెరో వాహనాలు, 76 మోటార్ సైకిలు 30 లీటర్స్ సారాయిని పోలీసులు సీజ్ చేశారు. కార్డెన్ అండ్ సెర్చ్ లో ఆదోని డీఎస్పీ శ్రీ J. శివ నారాయణస్వామి, ట్రైనింగ్ డిఎస్పి శ్రీధర్ ధీరజ్, […]

పోలీస్ స్టేషన్ లో నగదు మాయం..

కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో హోమ్ గార్డ్ గా విధులు నిర్వహిస్తున్న కె.మనోజ్ కుమార్ స్టేషన్ ప్రాపర్టీ రూమ్ డూప్లికేట్ తాళాలు తయారు చేసుకుని వివిధ కేసుల్లో సీజ్ చేసిన 5 లక్షల 63వేల రూపాయలు దొంగతనం చేసినట్లు పోలీస్ అధికారులు గుర్తించారు. హోంగార్డు మనోజ్ పై ఐపిసి 454-380 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి 3 లక్షల రూపాయలు నగదును స్వాధీనం తీసుకొని డి.ఎస్.పి శివ నారాయణ స్వామి ట్రైనీ […]

మార్పు ఓటుతోనే సాధ్యం

మార్పు ఓటుతోని సాధ్యపడుతుందని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్ శాతాన్ని పెంచాలని విజ్ఞప్తి చేశారు ఆదోని సబ్ కలెక్టర్ / ఎన్నికల అధికారి శివ్ నారాయణ్ శర్మ.. కర్నూలు జిల్లా.ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నుండి మున్సిపల్ హైస్కూల్ వరకు స్వీప్ ఓటు హక్కు అవగాహన పై బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఆదోని సబ్ కలెక్టర్/ ఆదోని ఎన్నికల అధికారి శివ్ నారాయణ్ జెండా ఊపి ప్రారంభించారు ర్యాలీలో సబ్ […]

అదోనిలో 10 మంది అభ్యర్థుల పోటీ, వారి గుర్తులు

కర్నూలు జిల్లా ఆదోని అసెంబ్లీ అభ్యర్థుల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు ఆదోని అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి/ సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అభ్యర్థులకు తెలియజేశారు. సోమవారం సబ్ కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో ఆదోని అసెంబ్లీ స్థానానికి పోటీ చేయు అభ్యర్థులకు కేటాయించిన గుర్తుల వివరాలను అభ్యర్థులకు తెలియజేశారు. ముందుగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, రిజిస్టర్ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఆప్షన్ మేరకు గుర్తులు కేటాయించడం జరుగుతుందన్నారు. […]

50 లక్షల బంగారు సిస్

రాబోయే జనరల్ ఎలక్షన్స్ లో భాగంగాకర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీసార్ గారి ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీ శివ నారాయణ స్వామి ఆదేశాల మేరకు రాబడిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహిస్తుండగా ముంబై కి చెందిన డానియల్ జైన్ అను వ్యక్తి వద్ద ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న సుమారు 50 లక్షల 13 వేల 508 రూపాయల 785.446 గ్రాముల బంగారము ఆభరణాలను సీజ్ చేశారు ట్రైనింగ్ […]

వజ్రాయుధం ఓటు హక్కు

ఓటు హక్కు తోటే బంగారు భవిష్యత్తు , సామాన్యుని చేతిలో వజ్రాయుధం ఓటు హక్కని ఆదోని సబ్ కలెక్టర్/ ఆదోని ఎన్నికల అధికారి శివ్ నారాయణ్ శర్మ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని మాతా శిశు హాస్పిటల్ (ఎం సి హెచ్) నుండి ఎమ్మిగనూరు సర్కిల్ వరకు స్వీప్ ఓటు హక్కు అవగాహన పై ఆదోని సబ్ కలెక్టర్/ ఆదోని ఎన్నికల అధికారి శివ్ నారాయణ్ శర్మ మున్సిపల్ అధికారులు, బి ఎల్ వో లు […]

Back To Top
Exit mobile version