కర్నూలు జిల్లా ఆదోని పట్టణం 9 వ వార్డు విజయనగర కాలనీ వైసీపీ ఝండా కు అవమానం జరిగింది. శుక్రవారం రాత్రి వైఎస్ఆర్సిపి జెండాను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు
వైసీపీ నాయకులు రఘునాథ రెడ్డి తెలిపిన వివరాల. మేరకు స్థానిక విజయనగర కాలనీ లో అర్థరాత్రి వైసీపీ ఝండా కట్టను పగులగొట్టే ప్రయత్నంలో పైపు ను వంచి దానికి బురద పరారైనారని, ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగమే , ఇది పిరికిపంద చర్యగా అభివర్ణిస్తూ దీనికి ఎమ్మెల్యే పార్థసారథి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ చర్యలకు పాల్పడిన వారిని గుర్తించి శిక్షించాలని 3 టౌన్ పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహులు , దేవా , రామకృష్ణారెడ్డి , కిషోర్ మరియు ycp నాయకులు పాల్గొన్నారు.



