Connect with us

Magazine Stories

మోస్ట్ అన్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన ఘనుడు

Published

on

★ సాధారణంగా విజయం సాధించిన వారు చరిత్ర సృష్టిస్తారు కానీ ఈ వ్యక్తి మాత్రం ఓడిపోయి రికార్డు సృష్టించాడు. 239 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి ఎలక్షన్ కింగ్ ఆఫ్ ఇండియా అని పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు మోస్ట్ అన్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్ గా ఎక్కువ సార్లు ఎలక్షన్స్ లో ఓడిపోయిన వ్యక్తిగా ఇతనికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా లభించింది.

★ సామాన్య ప్రజలు కూడా ఎలక్షన్స్ లో పాల్గొనవచ్చు అని అవేర్నెస్ తీసుకురావడానికి చేస్తున్న నా ప్రయత్నం.. తమిళనాడుకు చెందిన పద్మరాజన్

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చూపిస్తున్న పద్మరాజన్

తమిళనాడుకు చెందిన పద్మరాజన్ ఒక టైర్ పంచర్ రిపేర్ షాప్ ఓనర్ ఇతను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 239 సార్లు ఎన్నికల్లో పోటీ చేశాడు కానీ అన్ని సార్లు ఓడిపోయాడు. 1988 నుండి ఇప్పటివరకు లోకల్ ఎలక్షన్స్ నుండి లోక్సభ ఎలక్షన్స్ వరకు చివరికి ప్రెసిడెన్సీ ఎలక్షన్స్ లో కూడా పోటీ చేశాడు. అలా ఈయన 6 ప్రెసిడెన్షియల్ 6 వైస్ ప్రెసిడెన్షియల్ 32 లోక్సభ 50 రాజ్యసభ 73 పార్లమెంటరీ ఎలక్షన్స్ లలో పోటీ చేశాడు.

పద్మ రాజ్యం నామినేషన్ వేస్తున్న దాచిన ఫోటో

ఇతను  వాజ్పేయ్, పివి నరసింహారావు, జయలలిత, కరుణానిధి, అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీ, రాహుల్ గాంధీ, విజయకాంత్, మోదీ ఇలా ఎంతో మంది ప్రముఖుల మీద పోటీ చేశాడు. అయితే ఎలక్షన్స్ లో నామినేషన్స్ వేసేటప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ గా కొంత అమౌంట్ పే చేయలి ఆ నగదును తన టైర్ పంచర్ రిపేర్ షాప్ ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఎలక్షన్ నామినేషన్స్ కోసం సెక్యూరిటీ డిపాజిట్లు సుమారుగా 80 లక్షల రూపాయల వరకు ఖర్చు అయిందట.

పద్మరాజన్ కు వచ్చిన అవార్డు

ఇన్ని ఎలక్షన్స్ లో పాల్గొన్నా కానీ ఒక్కసారి కూడా ఎలక్షన్స్ క్యాంపెయిన్ చేయలేదు నామినేషన్స్ వేసిన ప్రతిసారి ఓడిపోవాలని కోరుకుంటారట మరి ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే సామాన్య ప్రజలు కూడా ఎలక్షన్స్ లో పాల్గొనవచ్చు అని అవేర్నెస్ తీసుకురావడానికి ఇతను ఇలా పోటీ చేస్తున్నాడట ఓడిపోతున్నా సరే పట్టించుకోకుండా ఇన్ని ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నాడు కాబట్టి ఇతనికి ఎలక్షన్ కింగ్ ఆఫ్ ఇండియా అని పేరు వచ్చింది అంతేకాదు మోస్ట్ అన్ సక్సెస్ఫుల్ కాండిడేట్ గా ఎక్కువ సార్లు ఎలక్షన్స్ లో ఓడిపోయిన వ్యక్తిగా ఇతనికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా లభించింది.

పద్మ రాజన్ షాప్ లో ఫోజ్ ఇచ్చిన ఫోటో
పద్మ రాజన్ షాప్ లో ఫోజ్ ఇచ్చిన ఫోటో

Magazine Stories

భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితం.

Published

on

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న అవిభాజిత భారతదేశ పంజాబ్ ప్రావిన్స్ లో జన్మించారు. డాక్టర్ సింగ్ 1948లో పంజాబ్ యూనివర్సిటీ నుంచి మ్యాట్రిక్యులేషన్ పరీక్షలు పూర్తి చేశారు. ఆయన విద్యా ప్రయాణం పంజాబ్ నుంచి యూకేలోని కేమ్బ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో 1957లో ఆర్థికశాస్త్రంలో ఫస్ట్ క్లాస్ హానర్స్ డిగ్రీ పొందడం వరకు సాగింది. ఆ తర్వాత డాక్టర్ సింగ్ తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుండి 1962లో ఆర్థికశాస్త్రంలో డి.ఫిల్  పొందారు.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనేక గొప్ప రచనలు చేశారు. ఆయన రచించిన “ఇండియాస్ ఎగ్‌స్టార్ట్ ట్రెండ్‌స్ అండ్ ప్రాస్పెక్ట్స్ ఫర్ సెల్ఫ్-స్టెయిన్డ్ గ్రోత్” (క్లారెండన్ ప్రెస్, ఆక్స్ఫర్డ్, 1964) అనే పుస్తకం భారతదేశ అంతర్గత దృష్టికోణంలోని వాణిజ్య విధానంపై ఒక ప్రారంభ విమర్శగా గుర్తించబడింది. తన అకాడమిక్ జీవితం పంజాబ్ యూనివర్సిటీ, ప్రతిష్టాత్మక డెల్హీ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్‌లో పని చేసిన సంవత్సరాలతో మరింత పటిష్టంగా తన ఆర్థిక నైపుణ్యలను పెంచుకున్నారు. ఈ సంవత్సరాలలో ఆయన UNCTAD కార్యాలయంలో కొంత సమయం పనిచేశారు. 1987 నుండి 1990 వరకు ఆయన జెనీవాలోని సౌత్ కమిషన్ కార్యదర్శిగా నియమితులయ్యారు.
1971లో డాక్టర్ మన్మోహన్ సింగ్ భారత ప్రభుత్వంలో వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారుగా చేరారు. తరువాత 1972లో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. అలాగే, ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శి, ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు, భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, ప్రధాన మంత్రికి సలహాదారుగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్‌గా కూడా పనిచేశారు.

1991 నుండి 1996 వరకు డాక్టర్ సింగ్ భారత దేశ ఆర్థిక మంత్రిగా పనిచేసిన కాలం భారతదేశపు స్వతంత్ర ఆర్థిక చరిత్రలో ఒక కీలకమైన మలుపుగా మారింది. ఆ కాలంలో ఆర్థిక సంస్కరణల విధానాన్ని ప్రారంభించిన ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధించారు.

డాక్టర్ మన్మోహన్ సింగ్ నిరాడంబర జీవితం గడుపుతున్నారు. ఆయన ప్రజా సేవా జీవితంలో పొందిన అనేక పురస్కారాలు, గౌరవాలు ఉన్నాయి. అందులో ప్రముఖమైనవి భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మ విభూషణ్ (1987), జవహర్లాల్ నెహ్రూ జయంతి శతాబ్ది పురస్కారం (1995), ఆసియా మనీ అవార్డు ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ (1993-1994), యూరో మనీ అవార్డు ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ (1993), యూనివర్సిటీ ఆఫ్ కేమ్బ్రిడ్జ్ యొక్క ఆడమ్ స్మిత్ ప్రైజ్ (1956), సెంట్రల్ లండన్ లోని సెంట్ జాన్ కాలేజ్ ద్వారా ప్రదర్శనలో ప్రఖ్యాతి చెందిన రైట్ ప్రైజ్ (1955) ఉన్నాయి. అలాగే, పలు దేశాలు అత్యున్నత పురస్కారాలు కూడా అందుకున్నారు.

డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రపంచవ్యాప్తంగా అనేక అంతర్జాతీయ సమావేశాలలో, అంతర్జాతీయ సంస్థలలో భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించారు. 1993లో అంగీకరించిన కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్న్మెంట్ మీటింగ్ (సైప్రస్), 1993లో వియన్నాలో జరిగిన ప్రపంచ హ్యూమన్ రైట్స్ కాన్ఫరెన్స్‌కు ఆయన నాయకత్వం వహించారు.
పోలిటికల్ కెరీర్ లో డాక్టర్ మన్మోహన్ సింగ్ 1991 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
1998 నుండి 2004 వరకు ఆయన రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు.
2004 జనవరి ఎన్నికల తరువాత డాక్టర్ మన్మోహన్ సింగ్ 22 మే 2004న ప్రధాని పదవిని స్వీకరించారు.
2009 మే 22న రెండవసారి ప్రమాణం చేశారు.
*మన్మోహన్ సింగ్ సాధించిన 10 ముఖ్యమైన విజయాలు..!
1) 1991 ఆర్థిక సంస్కరణలు
2) సమాచార హక్కు చట్టం, 2005
3) NREGA (ఇప్పుడు MGNREGA)
4) ఇండో-యుఎస్ సివిల్ న్యూక్లియర్ డీల్, 2008
5) విద్యా హక్కు చట్టం, 2009..
6) జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013
7) జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (NRHM)
8) అధిక GDP వృద్ధి రేటు..
9) బంగారు చతుర్భుజం వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు..
10) పటిష్టమైన విదేశాంగ విధానం.

Continue Reading

Magazine Stories

సోషల్ మీడియా హద్దుల్లో లేకపోతే భారీ మూల్యం తప్పదా?

Published

on

◆ సోషల్ మీడియా.. హద్దుల్లో లేకపోతే భారీ మూల్యం తప్పదా? ఏపీలో పరిణామాలు చెబుతోంది అదేనా?
కర్నూలు జిల్లా:
సోషల్ మీడియా.. ఓ వజ్రాయుధం. హద్దుల్లో ఉంటూ అవసరం మేరకు ఉపయోగిస్తే అద్భుతాలు చేయొచ్చు. అదే గీత దాటితే వాతలు తప్పవు. ఇప్పుడు సోషల్ మీడియా పేరు ఎత్తితే చాలు ఏపీ హడలెత్తిపోతోంది. పోస్టుల్లో మాటలు హద్దులు దాటి పత్తా లేకుండా పోయిన వారు ఎందరు? సోషల్ మీడియా యూజర్లకు మోగుతున్న వార్నింగ్ బెల్స్ ఏంటి? ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో ఇప్పటికైనా తెలుసుకోవాల్సిందేనా? ఏపీలో పరిణామాలు చెబుతోంది అదేనా?

ఆదోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఫిర్యాదు చేస్తున్న జనసేన నాయకులు

సోషల్ మీడియా అంటేనే ఏపీలో చాలామందికి వెన్నులో వణుకు పుడుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫైర్ అయిన క్షణం నుంచి ఏపీ రాజకీయాల్లో కొత్త మార్పు కనిపిస్తోంది. వాళ్లు వీళ్లు అని కాదు.. హద్దులు దాటి చెత్త రాతలు రాసిన ఎవరినీ పోలీసులు వదలడం లేదు. డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు కూడా ఈ రచ్చ అంటుకుంది. ఏపీ పోలీసులు వర్మకు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆర్జీవీ ఇంటికి వెళ్లిన ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు అందించారు.

ఆదోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో సోషల్ మీడియా యాక్టివిస్టుల పై ఫిర్యాదు చేస్తున్న ఫోటో

అంతెందుకు ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో నరసరావుపేట కు చెందిన సుధారాణిపై, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లలో పోసాని కృష్ణమురళి వంటి వారిపైనా కేసులు బుక్ చేశారు పోలీసులు.  అదే 3 టౌన్ పోలీస్ స్టేషన్లో అనంతపురం జిల్లా ముదిగుబ్బ గ్రామానికి చెందిన జె. రామాంజనేయులు సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసు నమోదు చేశారు.
ఏపీ ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో చంద్రబాబు ఆయన కుటుంబసభ్యులతో పాటు పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా ఆర్జీవీ ట్విట్టర్ లో పోస్టు పెట్టారని ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. గుంటూరు జిల్లా తుళ్లూరులోనూ మరో కేసు ఫైల్ అయ్యింది. దీంతో విచారణకు రావాలని పోలీసులు నోటీసులిచ్చారు. పోస్టు ఎప్పుడు పెట్టారన్నది కాదు.. తప్పుగా పెట్టారా లేదా అన్నట్లుగా వెతికి పట్టుకుంటున్నారు పోలీసులు. వర్మకు జస్ట్ నోటీసులు మాత్రమే. సోషల్ మీడియాలో హద్దులు దాటిన చాలామంది ఇప్పుడు జైలు ఊచలు లెక్కిస్తున్నారు.

సోషల్ మీడియా బ్యానర్

ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే.. అది అసభ్యకర పోస్టులే. సోషల్ మీడియాలో అసభ్యకర, అభ్యంతకరమైన పోస్టులు పెట్టే వారిపై ఏపీ పోలీసులు వారం రోజులుగా చర్యలు తీసుకుంటున్నారు. కేసులు నమోదు చేస్తూ అరెస్టులు కొనసాగిస్తున్నారు. మరికొందరికి విచారణ నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే, ఇందులో ఎక్కువ మంది వైసీపీ సానుభూతిపరులు ఉన్నారు. వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ లపైనా కేసులు నమోదయ్యాయి.

యాక్టర్స్ బ్యానర్ ఫోటో

డైరెక్టర్ ఆర్జీవీ, పోసాని కృష్ణమురళి వంటి వారిపైనా కేసులు బుక్ చేశారు పోలీసులు. సోషల్ మీడియా కార్యకర్తలపై కక్షపూరితంగా కేసులు పెడుతున్నారని కోర్టులో ఓ పిల్ వేయగా..హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అందులో తప్పేముందని ప్రశ్నించడమే కాదు.. కేసులు పెట్టొద్దని పోలీసులను ఆదేశించలేము అని దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. సోషల్ మీడియా పైశాచికత్వం ఏ స్థాయికి వెళ్లిందో చెప్పడానికి హైకోర్టు ఘాటు వ్యాఖ్యలే నిదర్శనం అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.

చేసే ప్రతి పోస్టు, రాసే ప్రతి మాటను గమనించే త్రినేత్రం ఒకటి ఉంటుంది. సోషల్ మీడియా యూజర్లు ప్రతీ ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదే. హద్దుల్లో లేకపోతే ప్రమాదంలోకి అడుగు పెట్టినట్లే. విమర్శలు చేయడంలో తప్పు లేదు. హద్దులు దాటి ఓవరాక్షన్ చేస్తేనే అసలు సమస్య. ఇంతకీ సోషల్ మీడియా ఘోరాలపై ఎలాంటి చట్టాలు ఉన్నాయి? ఆ కేసుల్లో ఇరుక్కుంటే జీవితం నాశనమేనా?

Continue Reading

Magazine Stories

డెంగ్యూ వ్యాధి నుండి  కోలుకునేందుకు సహాయపడే ఆహార పదార్థాలు

Published

on

కర్నూలు జిల్లా.. ఆదోని ప్రకృతి వైద్యం  : దేశవ్యాప్తంగా డెంగ్యూ జ్వరాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. 2024 సంవత్సరంలో  ముఖ్యంగా దోమల వల్ల వచ్చే అనారోగ్యాల వ్యాప్తికి సంబంధించినంత వరకు ఆందోళనకరంగా ఉంది. వెచ్చని ఉష్ణోగ్రతలు, అధిక తేమ స్థాయిలు ఏడెస్ దోమల సంతానోత్పత్తి, వృద్ధి చెందడానికి అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తాయి. డెంగ్యూ అనేది డి.ఈ. ఎన్. వి, వైరస్ వల్ల కలిగే వైరల్ ఇన్ఫెక్షన్. ఇది దోమ కాటు ద్వారా మానవులకు వ్యాపిస్తుంది. భారతదేశమే కాదు అనేక దేశాలు 2024లో డెంగ్యూ కేసుల్లో విపరీతమైన పెరుగుదలను చూస్తున్నాము. డెంగ్యూ నుండి త్వరగా కోలుకోవడానికి  మీ ఆహారంలో పోషక విలువలని  జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్లేట్‌లెట్స్ కోల్పోవడం, శరీరంలో అధిక ఉష్ణోగ్రత కారణంగా, మీ శక్తిని తిరిగి పొందడానికి సమయం పట్టే అవకాశం ఉంది. ప్లేట్‌లెట్‌లను ఉత్పత్తి చేయడానికి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను అవసరమైనంతగా ఉంచడానికి మీ శరీరానికి ఇనుము వంటి అవసరమైన పోషకాలు కూడా అవసరం. పండ్లు, కూరగాయలు విటమిన్లు, ఖనిఏజాలు, ఫైబర్, ఇతర ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలోను మరియు  రికవరీలో సహాయపడతాయి.
విజయ లక్ష్మి, ప్రకృతి వైద్య సలహాదారులు,
సెల్ : 99854 70289


డెంగ్యూ వ్యాధి రికవరీలో సహాయపడే ఆహార పదార్థాలు మరియు పండ్లు, కూరగాయల

వీట్ గ్రాస్ జూస్

1. వీట్ గ్రాస్ జూస్
డెంగ్యూతో బాధపడుతున్నప్పుడు సమర్థవంతంగా కోలుకోవడానికి వీట్ గ్రాస్ జూస్ తీసుకోవడం చాలా అవసరం ఈ  గోదుమ గడ్డి జూస్  లో విటమిన్ ఏ,సి,ఈ,కె, మరియు బి.కాంప్లెక్స్ రకాల మిటమిన్లు ఉన్నాయి, అంతే  కాదు ఇందులో కాల్షియం, ఐరన్, మిగ్నిషియం, పష్పరాస్, పొటాషియం, సోడియం, జింగ్, మరియు కాపర్ పుస్కాలంగా ఉన్నాయి అంతే కాకుండా ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల మీరు త్వరగా కోలుకోవడానికి సహాయపడతాయి.

కివి

2. కివి
డెంగ్యూతో బాధపడుతున్నప్పుడు సమర్థవంతంగా కోలుకోవడానికి పౌష్టికాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కివీ పండులో విటమిన్ సి, పొటాషియం కంటెంట్, పాలీఫెనాల్స్, గల్లిక్ యాసిడ్, ట్రోలాక్స్ సమానమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరం యొక్క రోగనిరోధక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇన్ఫెక్షన్‌తో సమర్థవంతంగా పోరాడడంలో సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంతో పాటు శరీరంలోని ఎలక్ట్రోలైట్‌లను సమతుల్యం చేయడానికి కూడా ఇది సహాయపడుతుంది.

బొప్పాయి

3. బొప్పాయి
బొప్పాయిలో పాపైన్, కారికైన్, చైమోపాపైన్, ఎసిటోజెనిన్ మొదలైన కొన్ని జీవసంబంధ క్రియాశీల సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరం యొక్క రోగనిరోధక స్థితిని బలోపేతం చేయడానికి, డెంగ్యూ సంబంధిత మంటను తగ్గించడానికి, వేగంగా కోలుకోవడానికి సహాయపడతాయి.

దానిమ్మ

4. దానిమ్మ
ఈ పండులో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క హెమటోలాజికల్ అవసరాలను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. ప్లేట్‌లెట్ కౌంట్‌ను సంరక్షించడంలో సహాయపడుతుంది. ఇది డెంగ్యూ జ్వరం సమయంలో, ఆ తర్వాత కూడా వచ్చే అలసటను, నీరసాన్ని తగ్గిస్తుంది. శరీరానికి తగిన శక్తినిస్తుంది.

పాలకూర

5. పాలకూర
విటమిన్ కె యొక్క అద్భుతమైన మూలం ఇది. నేరుగా ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచదు కానీ రక్త కణాలు బాగా గడ్డకట్టడంలో సహాయపడుతుంది. డెంగ్యూ రోగులకు పాలకూర ఇతర కీలక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. దీనిలో ఐరన్, ఫోలేట్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి. ప్రో-ఇన్‌ఫ్లమేటరీ సైటోకిన్‌లను అణిచివేయడం ద్వారా శరీరం అంతటా మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. అదనంగా, ఇది వైరస్ వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించడంలో సహాయపడుతుంది. అలసట, బలహీనత వంటి లక్షణాల నుండి వేగంగా కోలుకోవడానికి సహాయపడుతుంది.

బీట్‌రూట్

6. బీట్‌రూట్
ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన ఐరన్, ఫోలిక్ యాసిడ్ అధిక స్థాయిలో బీట్‌రూట్‌లో ఉంటాయి. అదనంగా బీట్‌రూట్ మలినాలను శుభ్రపరిచే లక్షణాలను కలిగి ఉంది. ఇది మీ కాలేయాన్ని శుభ్రపరచడానికి, దాని పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. డెంగ్యూ సంబంధిత మంట కారణంగా శరీరంలోని ప్లేట్‌లెట్స్ యొక్క ఫ్రీ రాడికల్ నష్టాన్ని నివారిస్తుంది. బీట్‌రూట్ హెమటోలాజికల్ స్థాయిలు పెంచడానికి సహాయపడుతుంది.

సిట్రస్ పండ్లు

7. సిట్రస్ పండ్లు
నారింజ, జామకాయ, నిమ్మకాయ మొదలైన సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. శరీరంలో ఆక్సీకరణను తగ్గిస్తుంది. రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంది. తద్వారా రక్తస్రావం ప్రమాదాన్ని, ప్లేట్‌లెట్ మార్పిడి అవసరాన్ని తగ్గిస్తుంది.

గుమ్మడికాయ

8. గుమ్మడికాయ
గుమ్మడి కాయలో విటమిన్ ఎ, బీట కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో మంట, ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడగలవు.

మెంతి కశయం

9. మెంతి కశయం
మెంతి కశయం కూడా డెంగ్యూ వ్యాధి నుండి త్వరగా కోలుకోవడానికి సహాయ పడుతాయి ఇందులో యాంటీ ఇంప్లమేటరీ గుణాలు ఉండడం వల్ల మీ శరీరం జ్వరం కారణంగా పెరిగిన వేడిని తగ్గిస్తాయి. 

Continue Reading
News8 hours ago

పేద కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆర్థిక సాయం

News1 day ago

నిజాముద్దీన్ కాలనీలో SIR ఓటర్ వెరిఫికేషన్

News1 day ago

కుప్పగల్ రైల్వేగేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి..

News2 days ago

ఆదోని మున్సిపల్ పరిధిలోని పాఠశాలలు, కళాశాలల్లో ఆధార్ స్పెషల్ క్యాంపులు

News2 days ago

ఆదోనిలో ఆసక్తికర ఘటన.. వైరల్‌గా మారిన ఎమ్మెల్యే వ్యాఖ్యలు

News2 days ago

ఆదోని నూతన ఆర్డీవో గా బాధ్యతలు స్వీకరించిన కె. అరుణా దేవి

News5 days ago

వృద్ధురాలిని బావిలోకి తోసేసిన డిగ్రీ విద్యార్థి అరెస్ట్

News3 weeks ago

అదోనిలో 30 లక్షలు విలువ చేసే 35  బైక్లు స్వాధీనం

News3 weeks ago

అదోనిలో 33 లక్షల విలువ చేసే 13.5 కేజీల వెండి స్వాధీనం

News3 weeks ago

సూర్యుని చుట్టూ ఒక పెద్ద వృత్తాకార వలయం

News2 days ago

ఆదోని నూతన ఆర్డీవో గా బాధ్యతలు స్వీకరించిన కె. అరుణా దేవి

News1 day ago

కుప్పగల్ రైల్వేగేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి..

News2 days ago

ఆదోనిలో ఆసక్తికర ఘటన.. వైరల్‌గా మారిన ఎమ్మెల్యే వ్యాఖ్యలు

News3 weeks ago

సూర్యుని చుట్టూ ఒక పెద్ద వృత్తాకార వలయం

News3 weeks ago

అదోనిలో 30 లక్షలు విలువ చేసే 35  బైక్లు స్వాధీనం

News5 days ago

వృద్ధురాలిని బావిలోకి తోసేసిన డిగ్రీ విద్యార్థి అరెస్ట్

News3 weeks ago

అదోనిలో 33 లక్షల విలువ చేసే 13.5 కేజీల వెండి స్వాధీనం

News1 day ago

నిజాముద్దీన్ కాలనీలో SIR ఓటర్ వెరిఫికేషన్

News2 days ago

ఆదోని మున్సిపల్ పరిధిలోని పాఠశాలలు, కళాశాలల్లో ఆధార్ స్పెషల్ క్యాంపులు

News8 hours ago

పేద కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆర్థిక సాయం

Trending