Tag: Featured

కుక్క దాడి 10 మందికి గాయాలు

కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెలగల్ గ్రామంలో పిచ్చికుక్క గ్రామస్తులపై దాడి చేయడంతో  10 మందికి గాయాలు అయ్యాయి. అందులో ఇద్దరికీ మస్తాన్ సాబ్ (68), గౌతమ్ (8) కు తీవ్ర గాయాలు కావడంతో ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  మిగిలిన 8 మందిని ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు బాధ్యులు తెలిపారు.

నీటి కుంటలో  పడి ఆరూగురు విద్యార్దులు మృతి

ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి . నీటి కుంటలో  పడి ఆరూగురు విద్యార్దులు మృత్యు వాత పడ్డారు . దీనితో ఆ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామానికి  చెందిన ఏడు మంది విద్యార్దులు సరదాగా ఈత నేర్చుకోవడానికి జిల్లా పరిషత్ హైస్కూల్ పక్కనే ఉన్న నీటి కుంటవద్దకు వెళ్ళారు. ఈత కొట్టడానికి కుంటలోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండటం తో ప్రమాదవశాత్తు నీటి కుంటలో  మునిగిపోయారు . […]

కోట శ్రీనివాసరావు కన్నుమూత

Jul 13, 2025 కోట శ్రీనివాసరావు కన్నుమూత టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న కోట ఈ తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. కోటా శ్రీనివాసరావు దాదాపు 750కు పైగా సినిమాల్లో నటించారు. ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు.

స్కూల్ కాలేజీల దగ్గర గుట్కాలు, సిగరెట్లు అమ్మితే చర్యలు

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ లో భాగంగా డి.ఎస్.పి హేమలత ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత దాడులు నిర్వహించారు. స్కూల్ కళాశాల సమీపంలో గుట్కాలు, సిగరెట్లు అమ్ముతున్న షాపులో సరుకును సీజ్ చేసి జరిమానా విధించారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి హేమలత మాట్లాడుతూ కళాశాల స్కూలకు 100 మీటర్ల వరకు ఎటువంటి మత్తు పదార్థాలు అమ్మినా బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్లు తాగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటివరకు పలు షాపుల్లో దాడులు నిర్వహించామని […]

తుంగభద్రా డ్యాం 20 గేట్లు ఎత్తి దిగువకు నీరు

తుంగభద్ర డ్యాం. 03 07 2025 గురువారం ఇరవై (20) గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేసిన డ్యామ్ అధికారులు. (2.5) రెండు నర్ర అడుగులు ఎత్తుకు 20 గేట్లు ఎత్తి దిగువకు 62766 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు తుంగభద్ర డ్యామ్ అధికారులు తెలిపారు. నది తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు..

తుంగభద్రా డ్యాం 4 గేట్లు ఎత్తి దిగువకు నీరు

తుంగభద్ర డ్యాం. 02 07 2025 బుధవారం ఉదయం నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నట్లు డ్యామ్ అధికారులు తెలిపారు. రెండు అడుగులు ఎత్తుకు నాలుగు గేట్లు ఎత్తి దిగువకు 10400 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు తుంగభద్ర డ్యామ్ అధికారులు సమాచారం ఇచ్చారు నది తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తుంగభద్ర డ్యాం అధికారులు ఆదేశాలు  జారీ చేశారు..

అక్రమంగా ఫీజులు వసూలు చేస్తూన్నారు

ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు  గుర్తింపు రద్దు చేయాలని డి ఎస్ ఎఫ్, పిడిఎస్ఓ విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు.కర్నూలు జిల్లా ఆదోని బీమాస్ రెస్టారెంట్లో విద్యార్థి సంఘాలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిహెచ్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, పి ఎస్ డి ఓ రాష్ట్ర నాయకుడు తిరుమలేష్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కొన్ని పాఠశాల యాజమాన్యలు స్కూల్ ఫీజు, […]

అదోనిలో 60 లక్షల బంగారు స్వాధీనం

కర్నూలు జిల్లా ఆదోని శివారు ఆస్పరి బైపాస్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా రశీదు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 600 గ్రాముల బంగారు బిస్కెట్లను సీఐ రాజశేఖర్ స్వాధీనం చేసుకున్నారు. వాటితోపాటు ఒక సెల్ ఫోను, కారు సీజ్ చేశారు. సిఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వాహనాలు తనికి చేస్తుండగా ఫజల్ అనే బంగారు వ్యాపారి వద్ద ఆరు బంగారు బిస్కెట్లు గుర్తించామని వాటికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు బిల్లులు చూపించకపోవడంతో వాటిని స్వాధీనం […]

అంతర్జాతీయ దొంగల ముఠా అరెస్ట్

కర్నూలు జిల్లా అదోనిలో అంతర్ జాతీయ డీజిల్ దొంగలు 11 మంది ముఠా ను వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసి వారివద్ద నుంది 1లక్ష 30 వేలు 140 రూపాయల నగదు నాలుగు కార్లు 350 లీటర్ల డీజిల్ క్యాన్లు 10 ఖాళీ క్యాన్లు స్వాధీనం చేసుకున్నరు. మరో ముగ్గురు మురారి లో ఉన్నట్లు సిఐ శ్రీరామ్ తెలిపారు. ముద్దాయిలను డిఎస్పి హేమలత ముందు హాజరు పరిచారు. డీఎస్పీ హేమలత మీడియాతో మాట్లాడుతూ వీరంతా తెలంగాణ […]

ఆదోనిలో ఘనంగా ప్రింటర్స్ డే

ఫిబ్రవరి 24 ప్రింటర్స్ డే సందర్భంగాకర్నూలు జిల్లా ఆదోని పట్టణం బి ఎన్ టాకీస్ వెనుక ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు దేవిశెట్టి ప్రకాష్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గోవిందు, కార్యదర్శి అబ్దుల్ రౌఫ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అందాలను మనసులోని భావాలను కళ్లకు కట్టినట్టు చూపించేది ఒక ప్రింటర్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యు లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Back To Top
Exit mobile version