Tag: Featured

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 17-02-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7492/- రూపాయలు కనిష్ట ధర ₹. 4089/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6639/- రూపాయలు కనిష్ట ధర ₹. 3889/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5786/- రూపాయలు కనిష్ట ధర ₹.5296/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.00/- రూపాయలు కనిష్ట ధర ₹.00/- రూపాయలు […]

ఖాకీల కళ్లు కప్పి కోర్టు గోడదూకి పరార్ అయిన దొంగ

అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు కోర్టుకు తరలిస్తుండగా ఖాకీల కళ్లు కప్పి కోర్టు గోడదూకి దొంగ పరారయ్యాడు.కర్నూలు జిల్లా ఆదోనిలో సోమవారం త్రీ టౌన్ పరిధిలో బైపాస్ లోని ఓ పాల డెయిరీలో దూరి రూ 10వేల నగదును దొంగలించి కేసులో ముద్దాయిని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచడానికి తీసుకెళ్తుండగా పోలీసుల కళ్లు కప్పి కోర్టు ఆవరణంలో గోడదూకి పరారైన ఘటన చోటుచేసుకుంది.  తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా మోహినాబాద్ మండలం సూరగాలి గ్రామానికి చెందిన మురళిపై […]

నకిలీ పత్రాలు పెట్టండి…. కోట్ల ఆస్తులు సొంతం చేసుకోండి

నకిలీ పత్రాలు పెట్టండి…. కోట్ల ఆస్తులు సొంతం చేసుకోండి అనే చందంగా మారింది ఆదోని సబ్ రిజిస్టర్ కార్యలయం.. ఒకటి మరవక ముందే మరొకటి నకిలీ పత్రాల భాగవతం బయటపడడంతో స్థానిక ప్రజల్లో ఆందోళన మొదలైంది.. ఇంకా ఇలా ఎన్ని జరిగాయి అని ఆదోని ప్రజలు చర్చించుకుంటున్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో కోట్ల విలువ చేసే భూమి అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని బాధితుడు యగ్గటి ఈశ్వరప్ప సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట కూర్చొని ఆందోళన చేపట్టారు. బతికున్న […]

అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్

ఆదోని సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు 95% ప్రాపర్టీ రికవరీ చేసినట్లు ఆదోని డీఎస్పీ సోమన్న తెలిపారు.కర్నూలు జిల్లా ఆదోని 1 టౌన్ పోలీసులు అంతర్ జిల్లా దొంగల ముఠాకు చెందిన గోవిందరాజులు, చిన్ని ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్దనుండి సుమారు 6 లక్షల 40 వేల రూపాయల విలువచేసే 80 గ్రాముల బంగారు ఆభరణాలు, 1 లక్ష 76 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డిఎస్పి సోమన్న విలేకరులతో మాట్లాడుతూ ఆలూరు […]

భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితం.

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న అవిభాజిత భారతదేశ పంజాబ్ ప్రావిన్స్ లో జన్మించారు. డాక్టర్ సింగ్ 1948లో పంజాబ్ యూనివర్సిటీ నుంచి మ్యాట్రిక్యులేషన్ పరీక్షలు పూర్తి చేశారు. ఆయన విద్యా ప్రయాణం పంజాబ్ నుంచి యూకేలోని కేమ్బ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో 1957లో ఆర్థికశాస్త్రంలో ఫస్ట్ క్లాస్ హానర్స్ డిగ్రీ పొందడం వరకు సాగింది. ఆ తర్వాత డాక్టర్ సింగ్ తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుండి 1962లో ఆర్థికశాస్త్రంలో డి.ఫిల్  పొందారు. మాజీ ప్రధాని […]

మట్కా, నాటు సారా స్థావరాలపై పోలీసుల దాడులు

కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పరిధిలోని రణమండల కొండల్లో, యల్లమ్మ కొండలో మరియు ఇస్వి కొండలలో అక్రమంగా నాటు సారా తయారు చేస్తున్న నాటు సారా స్థావరాలపై సీఐ శ్రీ రామ్ వారి సిబ్బంది దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో సుమారు 2000 లీటర్ల బెల్లం ఊటను ద్వంశం చేశారు. రెండు రోజుల వరుస దాడుల్లోఅక్రమంగా నాటు సారా అమ్ముతున్న 5 మందిని అరెస్టు చేసి వారి వారి వద్ద నుండి 110 లీటర్ల నాటు […]

ఏసీబీ వలలో కమర్షియల్ టాక్స్ ఆఫీసర్

లక్షా 50 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఒంగోలు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసు డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్.. కే.ఎస్. శ్రీనివాస ప్రసాద్.ఒంగోలు ఎసిబి డిఎస్పి రామచంద్రరావు తెలిపిన వివరాలు ఎలా ఉన్నాయి. సిహెచ్ శ్రీధర్ ట్రేడ్ కంపెనీకి నోటీసు ఫెనాల్టీ వేసి ఆ పెనాల్టీ లేకుండా చేసేందుకు ఒంగోలు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసు డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ కే.ఎస్. శ్రీనివాస ప్రసాద్ లక్షా యాభై వేల రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో సిహెచ్ […]

మోస్ట్ అన్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన ఘనుడు

★ సాధారణంగా విజయం సాధించిన వారు చరిత్ర సృష్టిస్తారు కానీ ఈ వ్యక్తి మాత్రం ఓడిపోయి రికార్డు సృష్టించాడు. 239 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి ఎలక్షన్ కింగ్ ఆఫ్ ఇండియా అని పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు మోస్ట్ అన్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్ గా ఎక్కువ సార్లు ఎలక్షన్స్ లో ఓడిపోయిన వ్యక్తిగా ఇతనికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా లభించింది. ★ సామాన్య ప్రజలు కూడా ఎలక్షన్స్ లో పాల్గొనవచ్చు అని అవేర్నెస్ తీసుకురావడానికి […]

వ్యాపార దిగ్గజం రతన్‌ టాటా కన్నుమూత

వ్యాపార దిగ్గజం టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (86) కన్నుమూశారు. గత కొన్ని రోజులు ముంబయిలోని ఓ ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం అర్థరాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొన్నిరోజులుగా ముంబయిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రతన్‌ టాటా మరణించిన విషయాన్ని హర్ష గొయెంకా ఎక్స్‌ వేదికగా అధికారికంగా ప్రకటించారు. వ్యాపార సామ్రాజ్యంలో తనకంటూ ఓ […]

డెంగ్యూ వ్యాధి నుండి  కోలుకునేందుకు సహాయపడే ఆహార పదార్థాలు

కర్నూలు జిల్లా.. ఆదోని ప్రకృతి వైద్యం  : దేశవ్యాప్తంగా డెంగ్యూ జ్వరాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. 2024 సంవత్సరంలో  ముఖ్యంగా దోమల వల్ల వచ్చే అనారోగ్యాల వ్యాప్తికి సంబంధించినంత వరకు ఆందోళనకరంగా ఉంది. వెచ్చని ఉష్ణోగ్రతలు, అధిక తేమ స్థాయిలు ఏడెస్ దోమల సంతానోత్పత్తి, వృద్ధి చెందడానికి అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తాయి. డెంగ్యూ అనేది డి.ఈ. ఎన్. వి, వైరస్ వల్ల కలిగే వైరల్ ఇన్ఫెక్షన్. ఇది దోమ […]

Back To Top
Exit mobile version