ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారధి పేర్కొన్నారు.కర్నూలు జిల్లా ఆదోనిలో గురువారం ఆర్ఆర్ లేబర్ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, బ్యాగ్, షూస్, యూనిఫామ్, అందజేసే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, జనసేన పార్టీ ఇంచార్జ్ మల్లప్ప, పాల్గొన్నారు. విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బ్యాగులను పుస్తకాలు, యూనిఫామ్ లు పంపిణీ చేశారు. అనంతరం పదవ తరగతిలో అత్యధిక […]
రాత్రి 8 దాటితే చర్యలు.. హోమ్ మినిస్టర్ అనిత
విశాఖపట్నం: హోమ్ మిస్టర్ అనిత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైజాగ్ లో విచ్చలవిడిగా గంజాయి అమ్ముతున్నారని మండిపడ్డారు. ఒరిస్సా నుండి వైజాగ్ కి రావడానికి మూడు చెక్పోస్టులు మాత్రమే ఉన్నాయంటే ఎంత దారుణ పరిస్థితి అన్నారు అమెజాన్లో కూడా కరీ లీవ్స్ అని పేరు పెట్టుకుని గంజాయిని నమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దారుణ పరిస్థితుల్లో రాష్ట్రంలో మార్పు రావాలంటే టాస్క్ ఫోర్ ఏర్పాటు చేసి రాత్రి 8 దాటితే గుంపులు గుంపులు గా కనిపిస్తే […]
ఆదోనిలో కూరగాయల ధరలు
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయలను ఈ విధంగా ఉన్నాయి 18.06.2024
ఈ నెల 19న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ YS.జగన్ అధ్యక్షతన ఈ నెల 19న (బుధవారం) ఉదయం 10.30 గంటలకు వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో విస్తృతస్ధాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి MLA లతో సహా ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులందరినీ కూడా ఆహ్వనించారు. వీరితో పాటు MP లు మినహా పార్లమెంట్కు పోటీచేసిన అభ్యర్ధులను కూడా ఆహ్వనించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
తెల్లరేషన్ కార్డుకు బియ్యంతోపాటు పంచదార, కందిపప్పు
అమరావతి: జూన్ నెలలో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తెల్లరేషన్ కార్డుదారులకు బియ్యంతోపాటు పంచదార, కందిపప్పును ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. పేదలు బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు కొంటున్నారు. రాష్ట్రంలో రేషన్ షాపుల ద్వారా కందిపప్పు ఇవ్వడం లేదన్న విషయం ఆయన దృష్టికి వెళ్లింది. సీఎం ఆదేశాలతో పౌరసరఫరాల శాఖ అధికారులు కదిలారు. రాష్ట్రస్థాయిలో కందిపప్పును కొనుగోలు చేసి ఎంఎల్ఎస్ పాయింట్లకు పంపారు. ఈనెల 20వతేదీ నుంచి రేషన్ షాపులకు బియ్యం, కందిపప్పు, […]
24 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు 24, 25, 26 తారీకు మూడు రోజులపాటు జరగనున్నయి. వాస్తవంగా ఎల్లుండి 19 నుంచి జరగవలసి ఉండగా గవర్నర్ బక్రీద్ పండుగ సందర్భంగా సెలవులపై ఉండటంతో అసెంబ్లీ సమావేశ తేదీల్లో మార్చారు. 24న ప్రోటుం స్పీకర్ ని ఎన్నుకున్న తరువాత నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులు చేత ప్రమాణ స్వీకారం నిర్వహిస్తారు.
పవన్ కళ్యాణ్ ఛాంబర్ రెడీ
అమరావతి: డిప్యూటీ సీఎం పవన్కు సచివాలయంలో ఛాంబర్ రెడీ చేశారు. సచివాలయంలో పవన్ కళ్యాణ్ కి రెండో బ్లాక్ మొదటి అంతస్తులో 212 రూమ్ కేటాయించరు.జనసేనకు చెందిన మంత్రులకు అదే అంతస్తులో ఛాంబర్లు ఏర్పాటు చేశారు. పవన్, నాదెండ్ల, కందుల దుర్గేష్ ఛాంబర్లు పక్కపక్కనే ఉన్నాయి. బుధవారం పవన్కల్యాణ్ బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు సమాచారం.
స్కార్పియో వహనం బోల్తా
కర్నూలు: Ts 33 c 9462 స్కార్పియో వహనం అలంపూర్ చౌరస్తా దాటిన తరువాత కర్నూలు వెళ్ళే రోడ్డులో ఉత్తర పుడ్ కంపిని దగ్గర వహనం బోల్తాపడి అందులో ప్రయాణిస్తున్న వారికి గాయాలు వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించినట్టు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
యువకుడు ఆత్మహత్య
కర్నూలు జిల్లా ఆదోని మండలం పేసలబండ గ్రామానికి చెందిన సలేంద్ర ఈశ్వర్ (20) అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ఎస్సై గోపాల్ తెలిపిన వివరాల మేరకు ఆదివారం రాత్రి నగరుర్ RS సమీపం km no 492/12-10 వద్ద ట్రైన్ నెంబర్ 22232 కింద పడి ఆత్మహత్యా చేసుకొని తీవ్రమైన రక్త గాయాలతో అక్కడికి అక్కడే చనిపోయాడ ని తెలిపారు.
రాజకీయాలపై హీరో సుమన్ వ్యాఖ్యలు
సినిమా వాళ్ళు హీరోలే కాదు లీడర్ల అవుతారు..దేశానికి మోడీ గారే సరైన ప్రధాని.. కర్నూలు జిల్లా ఆదోనిలో సినీ నటుడు సుమన్ ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ రెడీమేడ్ బట్టల షాపు ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సినిమా వాళ్ళు హీరోలే కాదు లీడర్ల అని ఎన్నోసార్లు నిరూపించుకున్నారు ఎన్టీ రామారావు, పవన్ కళ్యాణ్ ఇలా ఎంతోమంది లీడర్లు అయ్యారని హీరో సుమన్ తెలిపారు. దేశానికి మోడీ గారె […]