ఆదోని పట్టణంలో SC BC సంక్షేమ హాస్టల్స్ లో విద్యార్థులకు కనీసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి అలాగే ప్రతి ఒక్క విద్యార్థికి హాస్టల్ సీటు ఇవ్వాలని DSF ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా DSF జిల్లా ఉపాధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ ఆదోని పట్టణంలో ఎస్సీ, బీసీ సంక్షేమ హాస్టల్స్ లో కనీసం మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల ఎంతో మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం […]
మెగా డిఎస్సీ విధివిధానాల ఫైలుపై లోకేష్ తొలి సంతకం
అమరావతి: రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సచివాలయంలో సోమవారం నిరాడంబరంగా బాధ్యతలు స్వీకరించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ సచివాలయంలోకి అడుగుపెట్టిన లోకేష్.. 4వ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నంబర్ – 208 చాంబర్ లో బాధ్యతలు చేపట్టారు. మెగా డీఎస్సీ విధివిధానాలకు సంబంధించిన ఫైలుపై లోకేష్ తొలిసంతకం చేసి, కేబినెట్ కు పంపారు. పలువురు విద్యార్థి, ఉపాధ్యాయ సంఘ నాయకులు లోకేష్ ను కలిసి అభినందనలతో ముంచెత్తారు. బాధ్యతల స్వీకరణ […]
రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య
కర్నూలు జిల్లా ఆదోని మండలం ఇస్వీ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. వయసు సుమారు 25 నుంచి 30 సం. ఉండవచ్చని క్రీమ్ మల్టీకలర్ చుక్కలు గల టీ షర్ట్, బ్లూ కలర్ జీన్స్ ప్యాంటు ధరించి వున్నాడు. ఆచూకీ తెలిసినవారు RPSI గోపాల్ ఫోన్ No. 9849157634. ఈ ఫోన్ నెంబర్ కి కాల్ చేసి సమాచారం అందించాలని తెలిపారు.
కర్నూలు జిల్లా నూతన కలెక్టర్ గా రంజిత్ బాషా
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా సృజన బదిలీ కర్నూలు జిల్లా నూతన కలెక్టర్ గా పి రంజిత్ బాషా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్ల జిల్లా కలెక్టర్ గా ఉన్న పి రంజిత్ బాషాను కర్నూలు జిల్లా కలెక్టరుగా బదిలీ చేశారు. కర్నూలు జిల్లా కలెక్టర్ గా ఉన్న గుమ్మల్ల సృజనను ఎన్టీఆర్ జిల్లా కలెక్టరుగా బదిలీ చేశారు.
రామజలలో భారీ చెట్టు పడి పైప్లైన్ ధ్వంసం
కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ కమిషనర్ విలేకరులు ఇచ్చిన ప్రకటనలో బసాపురం రిజర్వాయర్ నుండి పంపింగ్ ద్వారా రామజల ఫిల్టరేషన్ ప్లాంటుకు వచ్చే 600 mm dia CI పైప్ లైన్ మీద భారీ చెట్టు పడి పైప్ లైన్ పూర్తిగా దెబ్బ తినడంతో ఆదోని మునిసిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది యుద్ధప్రాతిపదికన పైప్ లైన్ మరమ్మత్తు మరియు పునరుద్ధణ పనులు చేస్తున్నారని తెలిపారు. అందువల్ల ఆదోని పట్టణ ప్రజలు రామజల ఫిల్టరేషన్ ప్లాంట్ నుండి త్రాగు నీరు […]
17 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద పెండేకల్ గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న 17 మంది పేకాటరాయుళ్లను తాలూకా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 4 స్కూటర్లు 13 సెల్ ఫోన్లు, నగదు సుమారు 93వేలు స్వాధీనం చేసుకున్నట్లు ఇంకా 6 మంది పేకాట రాయుళ్లు పరారైనట్లు సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.
నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు
నందమూరి తారకరామారావు కుమార్తె ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు కుటుంబ సమేతంగా ఘనంగా నిర్వహించుకున్నారు. సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కి కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
రాజధాని అమరావతిలో సీఎం పర్యటన
అమరావతి : రాజధానిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. రాజధాని నిర్మాణాలు, భవన సముదాయాలను పరిశీలించరు. ప్రజా ప్రతినిధుల క్వార్టర్స్ లో నిర్మాణం పూర్తి అయిన గదులను చూశారు సీఎం చంద్రబాబు. అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు తానొస్తున్నానని ప్రత్యేక ఏర్పాట్లేం చేయలేదు కదా అని ప్రశ్నించరు. రాజధాని నిర్మాణ పనుల వాస్తవ పరిస్థితి తనకు తెలియాలన్నరు. అధికారు ప్రత్యేక ఏర్పాట్లేం చేయలేదని తెలిపారు. ఎమ్మెల్యే కొలికిపూడి మాట్లాడుతూ క్వాలిటీ మెటిరీయల్ వాడడం వల్ల చెక్కుచెదరలేదన్నరు. ప్రజా ప్రతినిధుల […]
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావు
అమరావతి: 1989 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ద్వారకా తిరుమల రావును నూతన డీజీపీగా నియమించిన ప్రభుత్వం.ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్న ద్వారకా తిరుమలరావు.
పిఎం కిసాన్ సమాన్ నిధి ద్వారా 21 వేల మంది రైతులకు పెట్టుబడి సహాయం
పిఎం కిసాన్ సమాన్ నిధి ద్వారా ఆదోని మండలంలో 21 వేల7 వందల74 మంది రైతులకు రూ. 4 కోట్ల 35 లక్షల 48 వేలు డి బి టి ద్వారా నేరుగా రైతు ఖాతాలలో జమ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆరెకల్ గ్రామం లో పీఎం కిసాన్ సమాన్ నిధి కార్యక్రమాన్ని లైవ్ వెబ్ క్యాస్ట్ ద్వారా ప్రదర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసి నుండి 17వ విడత ప్రారంభ […]