కర్నూల్ రేంజ్ ఏసిబి డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన డిఎస్పి సోమన్న

కర్నూలు జిల్లా: కర్నూల్ రేంజ్, ఉమ్మడి కర్నూల్ మరియు నంద్యాల జిల్లాల ఎసిబి నూతన డిఎస్పీగా దివిటి సోమన్న 30 04 2025 వతేది బాధ్యతలు స్వీకరించరు. ఎసిబి డిఎస్పీ సోమన్న
ఎసిబి సిబ్బందిచే గౌరవవందనం స్వీకరించారు.  శ్దివిటి సోమన్న  స్వగ్రామం వేపకుంట గ్రామం, కనగానపల్లి మండలం, అనంతపురం జిల్లా. 1991 లో ఎస్‌ఐ హోదాలో  పోలీసు డిపార్ట్మెంట్ లో  విధుల్లో నిర్వహించారు.
ఎస్‌ఐ గా క్రిష్ణగిరి, సంజామల, నందవరం, వెల్దుర్తి, పి‌టి‌సి అనంతపురం నందు ప్రమోషన్ పొందిన తరువాత సి‌ఐ గా సి‌ఐడిలో, ప్యాపిలి, ఆదోని తాలూకా, లక్కిరెడ్డిపల్లిలో పని చేసినారు. 2020 లో  డి‌ఎస్‌పిగా పదోన్నతి పొంది సి‌ఐడి శాఖలో మరియు ఆదోని సబ్ డివిజన్ లో పని చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version