7 నెలల బాలుడు అదృశ్యమైన సంఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం తుంగభద్ర రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. కాచాపురం గ్రామానికి చెందిన అంజి, అంకమ్మ దంపతులు పాత రైల్వే స్టేషన్ లో పాన్పు పై నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి 7 నెలల బాలుడు రామును అపహరించారు. గమనించిన తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో విచారించగా కన్పించకపోవడం తో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఆదోని రైల్వే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ఇద్దరు వ్యక్తులు బాబును అపహరించినట్లు గుర్తించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ వేగవంతం చేశారు.