Connect with us

News

మంత్రాలయం రైల్వే స్టేషన్ లో 7 నెలల బాలుడు కిడ్నాప్

Published

on

7 నెలల బాలుడు అదృశ్యమైన సంఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం తుంగభద్ర రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. కాచాపురం గ్రామానికి చెందిన అంజి, అంకమ్మ దంపతులు పాత రైల్వే స్టేషన్ లో పాన్పు పై నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి 7 నెలల బాలుడు రామును అపహరించారు. గమనించిన తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో విచారించగా కన్పించకపోవడం తో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఆదోని రైల్వే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ఇద్దరు వ్యక్తులు బాబును అపహరించినట్లు గుర్తించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ వేగవంతం చేశారు.

యూట్యూబ్ వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!

Published

on

ఎమ్మిగనూరు, మే 13:

లైసెన్స్‌ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..

ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. సోమన్న, ఏసీబీ డీఎస్పీ

Continue Reading

News

రైతులు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై పొందవచ్చు: ఆదోని మండల వ్యవసాయ అధికారి

Published

on

ఆదోని 08 మే 2026

వ్యవసాయ రంగంలో యాంత్రీకరణను పెంచేందుకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలను ఆదోని మండల రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి కోరారు. ఈ పథకం కింద ట్రాక్టర్లు, చిన్న ట్రాక్టర్లు, తైవాన్ స్ప్రేయర్లు మరియు వివిధ రకాల ట్రాక్టర్ అనుబంధ పరికరాలు రాయితీపై అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.

అర్హతలు మరియు నిబంధనలు:

భూమి కలిగిన రైతులు మరియు RoFR రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే, గత మూడు సంవత్సరాలలో కనీసం మూడు పంట సీజన్లకు e-Pantaలో నమోదైన CCRC రైతులు కూడా అర్హులు. అయితే, 2024-25 సంవత్సరంలో ఇప్పటికే సబ్సిడీ పొందిన వారు మళ్ళీ దరఖాస్తు చేయడానికి వీలుండదు. ప్రతి కుటుంబం నుండి ఒకరికి మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.

సబ్సిడీ వివరాలు:

SC, ST వర్గాలకు చెందిన వారు, మహిళా రైతులు మరియు చిన్న, సన్నకారు రైతులకు యంత్రం ధరలో 50 శాతం సబ్సిడీ లభిస్తుంది. ఇతర రైతులకు 40 శాతం వరకు రాయితీ ఉంటుంది. రైతులు తమ అవసరానికి అనుగుణంగా ఒకటి లేదా రెండు పరికరాలను ఎంపిక చేసుకోవచ్చు.

Ai image

ఎంపిక మరియు చెల్లింపు విధానం:

రైతులు తమ గ్రామ వ్యవసాయ సహాయకుల (RSK సిబ్బంది) సహకారంతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ట్రాక్టర్ పరికరాల కోసం దరఖాస్తు చేసే వారు ట్రాక్టర్ RC కాపీని తప్పనిసరిగా జతచేయాలి. జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఎంపికైన రైతులకు SMS ద్వారా సమాచారం అందుతుంది. ఎంపికైన వారు 15 రోజుల్లోగా తమ వాటా సొమ్మును ఆన్‌లైన్ ద్వారా డీలర్ ఖాతాకు చెల్లించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన గడువు తేదీలు:

దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 19-05-2026 చివరి తేదీ. ఎంపిక ప్రక్రియ (లాటరీ) మే 23 నుండి 25 వరకు జరుగుతుంది. ఎంపికైన రైతులు మే 26 నుండి జూన్ 9వ తేదీ లోపు నగదు చెల్లించాలి. మే 26 నుండి జూన్ 26వ తేదీ లోపు రైతులకు యంత్రాల సరఫరా జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి స్పష్టం చేశారు.

Continue Reading

News

రైతులు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై పొందవచ్చు: ఆదోని మండల వ్యవసాయ అధికారి

Published

on

ఆదోని 08 మే 2026

వ్యవసాయ రంగంలో యాంత్రీకరణను పెంచేందుకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలను ఆదోని మండల రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి కోరారు. ఈ పథకం కింద ట్రాక్టర్లు, చిన్న ట్రాక్టర్లు, తైవాన్ స్ప్రేయర్లు మరియు వివిధ రకాల ట్రాక్టర్ అనుబంధ పరికరాలు రాయితీపై అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.

అర్హతలు మరియు నిబంధనలు:

భూమి కలిగిన రైతులు మరియు RoFR రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే, గత మూడు సంవత్సరాలలో కనీసం మూడు పంట సీజన్లకు e-Pantaలో నమోదైన CCRC రైతులు కూడా అర్హులు. అయితే, 2024-25 సంవత్సరంలో ఇప్పటికే సబ్సిడీ పొందిన వారు మళ్ళీ దరఖాస్తు చేయడానికి వీలుండదు. ప్రతి కుటుంబం నుండి ఒకరికి మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.

ఏఐ పోస్టల్

సబ్సిడీ వివరాలు:

SC, ST వర్గాలకు చెందిన వారు, మహిళా రైతులు మరియు చిన్న, సన్నకారు రైతులకు యంత్రం ధరలో 50 శాతం సబ్సిడీ లభిస్తుంది. ఇతర రైతులకు 40 శాతం వరకు రాయితీ ఉంటుంది. రైతులు తమ అవసరానికి అనుగుణంగా ఒకటి లేదా రెండు పరికరాలను ఎంపిక చేసుకోవచ్చు.

ఎంపిక మరియు చెల్లింపు విధానం:

రైతులు తమ గ్రామ వ్యవసాయ సహాయకుల (RSK సిబ్బంది) సహకారంతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ట్రాక్టర్ పరికరాల కోసం దరఖాస్తు చేసే వారు ట్రాక్టర్ RC కాపీని తప్పనిసరిగా జతచేయాలి. జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఎంపికైన రైతులకు SMS ద్వారా సమాచారం అందుతుంది. ఎంపికైన వారు 15 రోజుల్లోగా తమ వాటా సొమ్మును ఆన్‌లైన్ ద్వారా డీలర్ ఖాతాకు చెల్లించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన గడువు తేదీలు:

దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 19-05-2026 చివరి తేదీ. ఎంపిక ప్రక్రియ (లాటరీ) మే 23 నుండి 25 వరకు జరుగుతుంది. ఎంపికైన రైతులు మే 26 నుండి జూన్ 9వ తేదీ లోపు నగదు చెల్లించాలి. మే 26 నుండి జూన్ 26వ తేదీ లోపు రైతులకు యంత్రాల సరఫరా జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి స్పష్టం చేశారు.

Continue Reading
News18 hours ago

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!

News6 days ago

రైతులు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై పొందవచ్చు: ఆదోని మండల వ్యవసాయ అధికారి

News6 days ago

రైతులు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై పొందవచ్చు: ఆదోని మండల వ్యవసాయ అధికారి

News3 weeks ago

భార్యను పంపడం లేదని సెల్ టవర్ ఎక్కిన భర్త

News1 month ago

క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే పీడీ యాక్ట్: ఆదోని వన్ టౌన్ సీఐ హెచ్చరిక

News1 month ago

పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులకు తీవ్ర గాయాలు

News2 months ago

ఆస్తి కోసం తండ్రి పై కత్తి తో దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

News2 months ago

ఆదోనిలో గ్యాస్ దాడులు 107 సిలిండర్లు సీజ్

News2 months ago

హోటళ్లపై ఆర్డీఓ మెరుపు దాడులు 34 గ్యాస్ సిలిండర్ల సీజ్

News2 months ago

ఆదోనిలో దొంగల హల్చల్ ఒకే రోజు మూడు కాలనీల్లో దోపిడీ!

Trending