వ్యాధి నయం కావడం లేదన్న బెంగతో ఆత్మహత్య

కడుపు నొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య.. వ్యాధి నయం కావడం లేదన్న బెంగతో మనస్తాపానికి గురై ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం ఆదోని సమీపంలో చోటుచేసుకుంది.

మృతుడి బంధువులతో వివరాలు తెలుసుకుంటున్న పోలీసులు

రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు జిల్లా ఆదోని మండలం చాగి గ్రామానికి చెందిన మాల మల్లప్ప అనే వ్యక్తి గత కొంతకాలంగా కడుపులో గడ్డల సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు అతడిని ఆదోనిలోని ఓ ప్రవేట్ హాస్పిటల్ లో కర్నూలులోని ఓమ్ని హాస్పిటల్ వంటి పలు ఆసుపత్రులలో చేర్పించి చికిత్స అందించారని అయినప్పటికీ కడుపు నొప్పి తగ్గకపోవడంతో మల్లప్ప తీవ్ర వేదనకు గురయి జీవితంపై విరక్తి చెందిన ఆయన, బుధవారం (18.02.2026) ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో ఆదోని – ఇస్వి ఆర్‌ఎస్ (Isvi RS) మధ్య రైల్వే కిలోమీటర్ నంబర్ 497/32 వద్ద డౌన్ లైన్ ట్రాక్ పై అటుగా వెళ్తున్న గుర్తు తెలియని రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

https://publicjudgement.in/wp-content/uploads/2026/02/km_20260218_1080p_60f_20260218_154948.mp4
మృతుడి బంధువులతో వివరాలు తెలుసుకుంటున్న పోలీసులు
మృతుడి ఆధార్ కార్డు

సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆదోని – మంత్రాలయం రైల్వే హెడ్ కానిస్టేబుల్ సి. శివరామయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మృతదేహంని పరిశీలిసున్న రైల్వే పోలీసులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version