40 ఏళ్ల తర్వాత ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయ రత్న భండార్ రహస్యలు బయట పడబోతున్నాయి.

చాలా సంవత్సరాల తర్వాత రత్న భండార్‌ను తిరిగి తెరవడం ఎప్పటికీ గుర్తుండిపోయే కార్యంగా చరిత్రలో నిలిచిపోతుంది.

ఒడిశా పూరీ లోని జగన్నాథ ఆలయం (1985) 40 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఆలయములోని రత్న భండార్‌ నిధి గదిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ గదిలోకి ప్రవేశించడానికి 16 మంది సిద్ధమయ్యారు. ఆలయంలోని రహస్య మందిరాల్లోకి ప్రవేశించడానికి ముందు జాగ్రత్తగా చర్యలుగా భువనేశ్వర్ నుండి ప్రత్యేక బృందాన్ని మరియు అనుభవిజ్ఞులైన పాములు పట్టే వారిని పిలిపించారు. ఆలయంలోని గదిలోకి ప్రవేశించడం అంటే ఎంతో ధైర్య సాహసాలతో కుడిన నిర్ణయం. త్రాచు పాములు విష సర్పాలు ఉన్నాయని అవి నిధిని కాపాడుతున్నాయ ని ఆలయ పెద్దలు ఎప్పటినుంచి చెబుతున్న మాట.

ఈ తలుపులు తెరుచుకుంటే ఎన్నో రహస్యాలు బయటకు రానున్నాయి. 2018లో రత్న భండార్‌లో ప్రవేశించడానికి 16 మందితో ఒక బృందం ప్రయత్నించింది, అయితే భితారా భండార్‌కు తాళంచెవి లేకపోవడం తో ఆప్పుడు కుదరలేదు. 6 సంవత్సరాల తర్వాత, ఒడిశా ప్రభుత్వం 2024 జూలై 14న రత్న భండార్ రహస్యాలను బట్టబయలు చేయడానికి మరోసారి సిద్ధమవుతోంది. నాలుగు దశాబ్దాలలో రహస్య గదిలోకి అడుగు పెట్టడం ఇదే మొదటి సారి అని అంటున్నారు. అయితే జగన్నాథుని అరుదైన అమూల్యమైన సంపదను బయటపడె అవకాశం ఉందని భావిస్తున్నారు.

రహస్య గది తలుపులు తెరవడానికి రోజులు దగ్గర పడుతుండడంతో ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య వ్యక్తి రాత్ తీసుకోవలసిన చర్యలపై పూర్తిస్థాయిలో సిద్ధమయ్యారు. రత్న భండారంలోని ఆభరణాలు, రత్నాలు వందల ఏళ్ల నాటివని, విలువైన వస్తువుల వివరాల్ని పగడ్బందీ జాబితా తయారు చేయడానికి అన్ని చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని సజావుగా చేయడానికి జులై 14 వ తేదీ ఉన్నతస్థాయి అధికారులకు తాళాలు అందించడానికి శ్రీ జగన్నాథ ఆలయ కమిటీకి నిర్వాహకులు సిద్ధమయ్యారు.

ఈ రత్న భండార్ వల్ల కేవలం నిధి నిక్షేపాలు గురించి కాకుండా రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. 2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ (BJP) విజయం సాధించడానికి గతంలో ఎన్నికలలో చేసిన వాగ్దానం నెరవేర్చినట్లు చూపించు కోవడానికి అస్త్రంగా వాడుకుంటుంది. రత్న భండారాన్ని తెరవడం ద్వారా ప్రజలలో విశ్వాసం మరియు ఆలయ విలువైన వస్తూ సామాగ్రి భద్రత లక్ష్యంగా బిజెపి పని చేస్తుంది.


ఇంతకు ఎన్నో సంవత్సరాల ఎదురుచూస్తున్న రత్న భాండాగారం రహస్యాలు బట్టబయలు అవుతాయా? తప్పిపోయిన తాళాల రహస్యాలు బయటపడతా? ఈ ప్రశ్నలకు సమాధానం కాలమే నిర్ణయిస్తుంది. అయితే రత్న భండార్‌ను తిరిగి తెరవడం ఎప్పటికీ గుర్తిండిపోయే సంఘటన.

జగన్నాథ ఆలయ తలుపులు తెరవడం కేవలం బంగారం మనీ మాణిక్యాలు బయటకు తీయడం అనేది కాదు, ఈ ఒక చారిత్రాత్మక సంఘటన. ఎంతో భక్తి శ్రద్ధలతో వారసత్వ సంపదను కాపాడుకోవడానికి ఇదొక గొప్ప నిర్ణయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version