ఉచిత గుండె ఆపరేషన్ అందించిన మహనీయుడు వైఎస్సార్

కర్నూలు జిల్లా ఆదోని లో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు వైఎస్ఆర్సిపి నాయకులు. అనంతరం ఆదోని పట్టణ అధ్యక్షులు బి దేవా వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు చంద్రకాంత్ రెడ్డి లు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ తో విద్యార్థులకు మేలు చేయడం జరిగిందని అన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి పేద వాడికి ఉచిత గుండె ఆపరేషన్ ఇలా అనేక రకాలుగా వైద్యం పేదలకు అందిస్తూ వైద్యానికి పెద్దపీట వేస్తూ పేదలకు రూపాయికి కిలో బియ్యం అందించి అలాగే ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇల్లు కట్టించి అందించారని తెలిపారు. మహిళలకు పొదుపు గ్రూపులు ద్వారా రుణాలు అందించి అండగా నిలబడడం మరి అలాంటి మహనీయుడు ఆకస్మిక ప్రమాదంతో మృతి చెందడంతో ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 600 మంది గుండె ఆగి పోయాయని అటువంటి మహానుభావుడు చరిత్రలో మరుపురాని చిరస్మరణీయుడుగా నిలిచాడని కొనియాడారు. తనయుడుగా ఆయన ఆశయాలతో వైయస్ జగన్ వైఎస్ఆర్సిపి పార్టీ స్థాపించి తండ్రికి తగ్గ తనయుడుగా ఈ రాష్ట్ర ప్రజల కోసం నవరత్నాలు అనే సంక్షేమ పథకాలు ద్వారా ప్రతి పేదకు ప్రతి విద్యార్థికి ప్రతి కార్మికులకు ప్రతి మహిళలకు అండగా నిలిచారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అరాచక శక్తులు విలయతాండవం ఆడుతున్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సునర్ ఖాదర్, నల్లారెడ్డి, ఫయాజ్, చిన్న ఈరన్న తాయన్న రామకృష్ణ గంగాధర్ సుధాకర్ ఆర్వి బాబు శ్రీలక్ష్మి రామకృష్ణ మల్లికార్జున రమేష్ వేణు రైల్వే ఈరన్న వచ్చిరప్ప తిమ్మప్ప సోమలింగ లక్ష్మన్న రామలింగేశ్వర  స్వామి దుర్గప్ప సురేష్ స్టోర్ గోపాల్ శీను మధు కుప్పయ్య తిక్కన్న గోవిందు మహమ్మద్ భాష జమీల్ గోపాల్ రెడ్డి వీరారెడ్డి సర్పంచ్ మహాదేవ సుల్తాన్పురం సర్పంచ్ వీరేష్ నారి నాగరాజు సిద్ధ లక్ష్మణ రామంజి దానం తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version